హైదరాబాద్ లోని చందానగర్ ఓ ఓ పాత ఇల్లు కూలుస్తుండగా ప్రమాదం జరిగింది. గోడ శకలాలు మీద పడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. 

హైదరాబాద్ : హైదరాబాద్ చందానగర్ లో విషాదం ఘటన చోటు చేసుకుంది. పాపిరెడ్డి కాలనీలో పాత ఇల్లు కూలుస్తుండగా ప్రమాదం జరిగింది. గోడ కూలుస్తుండగా ఒక్కసారిగా మీద పడి మృతి చెందాడు. ఇద్దరు కార్మికులు పాత ఇల్లు కూల్చడానికి వచ్చారు. ఒకరు కర్రతో గోడను కొడుతుండగా.. మరొకరు పక్కనే నిలుచున్నారు. గోడ ఒక్కసారిగా కూలడంతో.. గోడను కర్రతో కొట్టిన వ్యక్తి తప్పించుకున్నాడు. కానీ పక్కనే ఉన్న మరో కార్మికుడు తప్పించుకోలేకపోవడంతో.. గోడ శకలాలు మీదపడి మృతి చెందాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred