Asianet News TeluguAsianet News Telugu

పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం: ఢిల్లీలో వీహెచ్, హర్షకుమార్ ధర్నా

హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్  గురువారం నాడు  న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.

vh, harshakumar protest in newdelhi for estblish ambedkar statue at panjagutta
Author
Hyderabad, First Published Jul 11, 2019, 2:04 PM IST

న్యూఢిల్లీ: హైద్రాబాద్ పంజగుట్టలో అంబేద్కర్ విగ్రహం పున:ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్  గురువారం నాడు  న్యూఢిల్లీలో దీక్షకు దిగారు.

హైద్రాబాద్ పంజగుట్ట సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ఈ విగ్రహన్ని తిరిగి అదే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని  కోరుతూ వి. హనుమంతరావు కొంతకాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే  ఇవాళ న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు, మాజీ ఎంపీ హర్షకుమార్ లు దీక్షకు దిగారు..  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ విగ్రహాన్ని  తెలంగాణ ప్రభుత్వం ఈ విగ్రహన్ని తొలగించిందని  వి. హనుమంతరావు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios