తెలంగాణ రాష్ట్రం నుండి 40.20 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నుండి తెలంగాణ సర్కార్ కి లేఖ వచ్చింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుండి 40.20 లక్షల టన్నుల సాధారణ బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాసింగి సీజన్ లో Boiled Rice మాత్రం తీసుకోబోమని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసింది. 

Telangana రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అవుతుంది. అయితే బాయిల్డ్ రైస్ కాకుండా సాధారణ రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేయడంతో రాష్ట్రంలో Farmers పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 35 లక్షల ఎకరాల్లో వరి పండించినట్టుగా వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 65 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు.

సాధారణంగా క్వింటాల్ Paddy ధాన్యం మిల్లింగ్ చేస్తే 17 కిలోలు నూకలు వస్తాయి. అయితే యాసంగిలో మాత్రం క్వింటాల్ వరి ధాన్యం మిల్లింగ్ చేస్తే 34 కిలోల నూకలు వస్తాయి. అయితే అదనంగా వచ్చే నూకల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై క్వింటాల్ కు రూ. 400ల నుండి రూ. 500 వరకుభారం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

రాష్ట్రం నుండి బాయిల్డ్ రైస్ తాము ఇవ్వబోమని గతంలో కేంద్రానికి లేఖ రాసివ్వడంతో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. 

వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి కేంద్రంపై TRS రెండు మాసాలుగా తీవ్రమైన పోరాటం చేసింది. పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టుగానే తెలంగాణలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ విషయమై పలు రకాల ఆందోళనలు చేసింది. ఈ నెల 11న ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. 

ఈ నెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నిర్ణయం మేరకు రాష్ట్రంలోని పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి వరి ధాన్యం కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సాధారణ రకం వరికి క్వింటాల్ కి రూ. 1940 ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1960 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

బాయిల్డ్ రైస్ కాకుండా సాధారణ రైస్ ను తాము తీసుకుంటామని కేంద్రం రాష్ట్రానికి లేఖ రాయడంతో రైతుల నుండి సేకరించిన దాన్యంలో సాధారణ ధాన్యాన్ని కేంద్రానికి రాష్ట్రం ఇవ్వనుంది.

ఈ రబీ సీజన్ లో సాధారణ బియ్యాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఈ నెల 13న లేఖ రాసింది. ఈ లేఖకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి లేఖ వచ్చింది. సాధారణ బియ్యం సేకరించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు సాధారణ బియ్యాన్ని ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించింది.

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో సుమారు 40.20 లక్షల టన్నుల సాధారణ బియ్యం వచ్చే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. 

ఈ యాసంగి సీజన్ లో 6,968 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.1,77,901 టన్నుల నెలవారీ సామర్ధ్యం ఉన్న 765 రైస్ మిల్లులు, 5,67,265 టన్నుల కెపాసిటీ గల బాయిల్డ్ రైస్ మిల్లులు 2020-21 వరి ధాన్యం మిల్లింగ్ చేస్తున్నాయని ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.