పండగపూట జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో భోగీ రోజు ఆనందంగా గడపాల్సిన వారంతా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు.
పండగపూట జాతీయ రహదారి మీద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో భోగీ రోజు ఆనందంగా గడపాల్సిన వారంతా ప్రమాదానికి గురై ఆస్పత్రి పాలయ్యారు.
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఈ ఘటనలో రెండు ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 13, 2021, 12:20 PM IST