Asianet News TeluguAsianet News Telugu

నల్గొండ జిల్లా ఇనుపాముల వద్ద రోడ్డు ప్రమాదం: కారు దగ్దం, ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం  ఇనుపాములలో  రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  కారు దగ్ధమైంది.  కారులో ప్రయాణీస్తున్న  ఇద్దరు  మృతి చెందారు.  మరో ముగ్గురు  తీవ్రంగా గాయపడ్డారు.

Two killed in Road accident at  inupamula in Nalgonda District
Author
First Published Dec 16, 2022, 9:22 AM IST

కేతేపల్లి: నల్గొండ జిల్లా కేతేపల్లి  మండలం ఇనుపాముల వద్ద  శుక్రవారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు. హైద్రాబాద్ నుండి కారులో  సూర్యాపేటకు వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది.ఫణికుమార్  తన కుటుంబ సభ్యులతో కారులో  హైద్రాబాద్ నుండి  సూర్యాపేటకు వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. ఫణికుమార్ కుటుంబం సూర్యాపేటలోని విద్యానగర్ లో నివాసం ఉంటుంది. ఇనుపాముల వద్ద  కారు డివైడర్ ను ఢీకొని  రోడ్డుపై బోల్తా కొట్టింది. దీంతో కారులో  మంటలు చెలరేగాయి.  ఆ సమయంలో  వెనుక నుండి వస్తున్న వాహనదారులు ఈ విషయాన్ని గమనించి కారులో ఉన్న వారిని  బయటకు తీశారు. ఈ ప్రమాదం జరిగిన  సమయంలో కారులో ఐదుగురున్నారు.  ఈ ప్రమాదంలో గాయపడిన  ఐదుగురిని నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ ఫణికుమార్ అతని తల్లి మృతి చెందారు.  ఈ ప్రమాదంలో ఫణికుమార్  భార్య , పిల్లలు కామినేని  ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో  రోజూ ఏదో ఒక చోట  ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  డ్రైవర్ల నిర్లక్ష్యంతో పాటు  అతి వేగం ప్రధానంగా  ప్రమాదాలకు కారణాలుగా  పోలీసులు చెబుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ లో  ఈ నెల  14న జరిగిన రోడ్డు ప్రమాదంలో   ఆరుగురు మృతి చెందారు. మరో  21 మంది గాయపడ్డారు.  50 మంది ప్రయాణీకులతో వెళ్తున్న  ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కనే లోయలో  బోల్తాకొట్టింది. దీంతో  బస్సులో ఉన్న ఆరుగురు మృతి చెందారు. 

ఈ నెల 12న  నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పరీక్షలు రాసేందుకు  వెళ్తున్న  నర్సింగ్  విద్యార్ధుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భవాని స్కూల్  ఆఫ్ నర్సింగ్ విద్యార్ధినులు తీవ్రంగా గాయపడ్డారు. తాటికల్   ఫ్లైఓవర్ నుండి  సర్వీస్ రోడ్డు క్రాస్ అవుతున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురైంది.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం జెట్టిపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ నెల 8వ తేదీన ఈ ప్రమాదం జరిగింది.కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సవలంగ రోడ్డులోని కల్లాపుర వద్ద కారు, లారీ ఢీకొన్న ప్రమాదంలో  ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు మృతి చెందారు.ఈ ఘటన ఈ నెల  11న జరిగింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios