జీడిమెట్లలోని ఫార్మా కంపెనీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.

హైదరాబాద్‌ను వరుస అగ్నిప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా జీడిమెట్లలోని ఫార్మా కంపెనీలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred