గో సంరక్షకుల మృతిపై విచారం వ్యక్తం చేసిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గో సంరక్షకులు పృథ్వి తో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి (yadadri bhuvangiri) జిల్లా చౌటుప్పల్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గో సంరక్షకులు పృథ్వి (pruthvi) తో పాటు మరొకరు మృతి చెందారు. ఈ ఘటనపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ttd chiarman yv subbareddy) విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే మృతుల కుటుంబాలను పరమార్శిస్తానని తెలిపారు. జనవరి 16వ తేదీన ఓ కారులో ఏడుగురు గో రక్షకులు ప్రయాణిస్తున్నారు. ఆ కారు చౌటుప్పల్ (chotuppal) వద్దకు రాగానే ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పృథ్వీతో ఇంకో వ్యక్తి మృతి చెందారు. నలుగురు క్షేమంగా ఉండగా.. ఒకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను గోసంరక్షణ ఉద్యమ నాయకుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శివకుమార్ (shivakumar)ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కి తెలియజేశారు. ప్రమాద వివరాలు చెప్పారు. ఈ ఘటనపై ఆయన ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. త్వరలోనే మృతుల కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.