Asianet News TeluguAsianet News Telugu

పండుగవేళ.. మహిళలకు టీఎస్‌ఆర్‌టీసీ మరో శుభవార్త 

TSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. పండుగకు ప్రత్యేక బస్సులను నడిపిస్తామని, ఈ ప్రత్యేక బస్సులోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ తెలిపింది.
 

TSRTC to run 4484 special buses for Sankranti KRJ
Author
First Published Jan 6, 2024, 12:41 AM IST

TSRTC: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) గుడ్ న్యూస్ చెప్పింది.  పండుగ సందర్భంగా  జనవరి 7 నుంచి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రకటించింది. ప్రయాణికులు 626 సర్వీసుల్లో తమ సీట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

ఈ ప్రత్యేక బస్సులలోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించేలా మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని, కానీ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమేనని  ప్రజా రవాణా సంస్థ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించేందుకు   శుక్రవారం బస్‌భవన్‌లో టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది.  టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ నేతృత్వంలో అధికారుల సమావేశం నిర్వహించారు.  

ఈ సందర్భంగా టీఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ..హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్, జెబిఎస్, ఉప్పల్ ఎక్స్ రోడ్లు, ఆరామ్‌ఘర్, ఎల్‌బి నగర్ ఎక్స్ రోడ్లు, కెపిహెచ్‌బి, బోయిన్‌పల్లి , హైదరాబాద్‌లో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలో (మహాలక్ష్మి పథకం కారణంగా) టిఎస్‌ఆర్‌టిసి ప్రత్యేక బస్సులను నడుపుతుందని తెలిపారు. బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం టిఎస్‌ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారనీ, తాగునీరు, మొబైల్ బయో-టాయిలెట్లు, అవసరమైన ప్రదేశాలలో ప్రయాణీకుల సౌకర్యం కోసం ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయని  సజ్జనార్ చెప్పారు. 

ఈ ప్రత్యేక శిబిరాల్లో  ఇద్దరు DVM ర్యాంక్ అధికారులు ఉంటారనీ, వారు డిమాండ్ ఆధారంగా ప్రత్యేక బస్సుల లభ్యతను నిర్ధారిస్తారని అన్నారాయన. టిఎస్‌ఆర్‌టిసి టిక్కెట్ ధరలను పెంచబోదని, పండుగ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతామని చెప్పారు.

జేబీఎస్, మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద టిఎస్‌ఆర్‌టిసి బస్సుల కోసం ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేశారనీ, తద్వారా ప్రజలు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చుననీ, పౌరులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని, అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని అధికారులు కోరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios