తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఐదుగురు నిందితులను ప్రశ్నించేందుకు కస్టడీకి అనుమతించాలని ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. వివరాలు.. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ కూడా విచారణ జరపుతుంది. 

ఈ క్రమంలోనే ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్‌గూడ జైలులో ఉన్న రేణుకా రాథోడ్, డాక్యా నాయక్, నేతావత్ రాజేశ్వర్, ఫతావత్ గోపాల్ నాయక్, షమీమ్‌ల వాంగ్మూలాలు నమోదు చేయాలని ఈడీ భావించింది. ఈ క్రమంలోనే వీరిని కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైదరాబాద్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కౌంటర్ దాఖలు చేయడం ద్వారా ఈడీ చర్యను వ్యతిరేకించింది. ఇక, ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. 

అయితే ఈ కేసులో విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు.. నిందితులను ప్రశ్నించేందుకు అనుమతి కోరేందుకు పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టును ఆశ్రయించే అవకాశాలు కల్పిస్తున్నాయి.