సీఎం కేసీఆర్ ని కలిసిన ఘంటా చక్రపాణి
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ని గురువారం ఉదయం టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి కలిశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. మరోసారి కేసీఆర్ కి ప్రజలు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. ఈ రోజు కేసీఆర్.. సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు.
ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు గాను.. సీఎం కేసీఆర్ కి ఘంటా చక్రపాణి అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్ లో ఉన్న కేసీఆర్ ని స్వయంగా కలిసి.. శుభాకాంక్షలు తెలిపారు.