తెలంగాణ ఎస్సై, ఏఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి. 587 పోస్టులకు 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది.

TSLPRB: తెలంగాణలో వేలాది మంది అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్సై, ఏఎస్సై ఫలితాలు విడుదలయ్యాయి. కీలకమైన కటాఫ్ మార్కుల ప్రక్రియ పూర్తి చేసిన TSLPRB తాజాగా ఫలితాలను, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 587 పోస్టులకు గానూ.. 434 మంది పురుషులు, 153 మంది మహిళలను TSLPRB ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సైట్లో ఉంచినట్టు పేర్కొంది. మరోవైపు సెప్టెంబర్‌లో కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..