బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. రూ.18 వేల కాంట్రాక్ట్ తీసుకుని బీజేపీలో చేరారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీఆర్ఎస్ నేతలు. రూ.18 వేల కాంట్రాక్ట్ తీసుకుని బీజేపీలో చేరారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతకుముందు శనివారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పూటకో మాట చెబుతారని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడని ఆరోపించారు. రూ. 20 వేల కోట్లు కాంట్రాక్టులు పొందినట్టుగా రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి దొరికిపోయిన దొంగ అని ఆరోపించారు. ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని జగదీశ్ రెడ్డి చెప్పారు.
మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినట్టుగా బహిర్గతమైందని ఆయన ఎద్దేవా చేశారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి.. త్యాగాలు చేశామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడు సీట్లున్న పార్టీలోకి వెళితే మునుగోడు నియోజకర్గం అభివృద్ది చెందుతుందా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రలో భాగంగానే బీజేపీ మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చిందన్నారు. మునుగోడు ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని కోరారు.
ALso Read:రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం.. మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. దేశంలో నిత్యావసరాలతో పాటు అన్ని రేట్లు పెరుగుతాయని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తామని.. అభివృద్ధి పనులు కొనసాగుతాయని మంత్రి వివరించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం కోసమే మునుగోడు ఉపఎన్నిక అని మంత్రి అన్నారు. రాజగోపాల్ రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని ... ఎక్కడికక్కడ రాజగోపాల్ రెడ్డిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని జగదీశ్ రెడ్డి జోస్యం చెప్పారు.
