వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేసిన టీఆర్ఎస్ నేత..!
ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గాను.. ఆ వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. అతను కింద పడిపోవడం గమనార్హం.
ఓ వికలాంగుడి పట్ల టీఆర్ఎస్ నేత అనుచితంగా ప్రవర్తించాడు. స్టేజీ పై నుంచి కిందకు లాగేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో ఇటీవల టీఆర్ఎస్ ధూం ధూం కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే.
కాగా.. ఆ స్టేజీపై తనకు ఫింఛన్ రావడం లేదంటూ రాజేష్ అనే దివ్యాంగుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించాడు. దీంతో.., అతని పట్ల టీఆర్ఎస్ నేత ఒకరు అనుచితంగా ప్రవర్తించాడు. ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు గాను.. ఆ వికలాంగుడిని స్టేజీ పై నుంచి కిందకు లాగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. అతను కింద పడిపోవడం గమనార్హం.
దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా... టీఆర్ఎస్ నేతపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ కార్యక్రమానికి ముందే బాధితుడు అధికారులను కలిసి మాట్లాడాలని అనుకున్నాడు. అయితే...వారు అనుమతి ఇవ్వకపోవడంతో... అలా స్టేజీ ఎక్కి తన బాధను వెళ్లగక్కాడు. ప్రభుత్వంపై విమర్శలు చేశాడని.. అతనిని టీఆర్ఎస్ నేత కింద పడేశాడు.