వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దల మధ్య పంచాయతీ జరుగుతుండగానే రాళ్లతో ఆయనను కొట్టి చంపారు.
వికారాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. అందరూ చూస్తుండగానే ఈ హత్య సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దేముల్ మండలం టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీపీ వాణిశ్రీ భర్త వీరప్ప దారుణ హత్యకు గురయ్యాడు.
పెద్దముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో గల ఆంజనేయ స్వామి గుడి వద్ద సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగింది. గ్రామ పెద్దల మధ్య పంచాయతీ జరుగుతుండగా కొంత మంది వీరప్పపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
తాండూరులోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే వీరప్ప మరణించాడు. ఇసుక వ్యవహారంలో ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.