Asianet News TeluguAsianet News Telugu

సిట్ విచారణకు రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన, ఉద్రిక్తత

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  సిట్  విచారణకు  రేవంత్ రెడ్డి  హాజరయ్యారు.    మరో వైపు సిట్  కార్యాలయం ముందు  కాంగ్రెస్   పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. 

TPCC  Chief  Revanth Reddy  Attends  To  SIT Probe,  Congress  Protest  in Hyderabad
Author
First Published Mar 23, 2023, 1:22 PM IST

హైదరాబాద్:  టీఎస్‌పసీఎస్‌సీ  ప్రశ్నాపత్రం పేపర్ లీక్ కేసులో  సిట్  విచారణకు  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి గురువారంనాడు హాజరయ్యారు.   రేవంత్ రెడ్డిని సిట్  అధికారులు  విచారణకు  పిలవడంతో   సిట్  కార్యాలయం ముందు  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు . బారికేడ్లను తోసుకుని  సిట్  కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. సిట్  కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లిన  కాంగ్రెస్ శ్రేణులను  పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ సమయంలో  పోలీసులు ,  కాంగ్రెస్ శ్రేణుల మద్య  తోపులాట  చోటు  చేసుకుంది.  ఈ సమయంలో  ఉద్రిక్తత  నెలకొంది. 

ఇవాళ  ఉదయం  11 గంటల తర్వాత  రేవంత్ రెడ్డి  సిట్  కార్యాలయానికి బయలుదేరారు.  లిబర్టీ వద్ద  రేవంత్ రెడ్డి  కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు.   దీంతో  రేవంత్ రెడ్డి  నడుచుకుంటూ  రేవంత్ రెడ్డి సిట్  కార్యాలయానికి వెళ్లారు.  రేవంత్ రెడ్డి  కాన్వాయ్ ను నిలిపివేయడంతో కాంగ్రెస్ శ్రేణులు  రోడ్డుపై బైఠాయించి  నిరసనకు దిగారు. 

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్ ఘటనపై  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు  చేశారు. మంత్రి కేటీఆర్  పీఏ  తిరుపతికి  ఈ వ్యవహరంలో  పాత్ర ఉందని ఆరోపించారు.  మరో వైపు  ఈ పేపర్ లీక్ ఘటనకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని  ఆయన  డిమాండ్  చేశారు. ఈ వ్యవహరానికి  ఐటీ శాఖతో  సంబంధం ఉందని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.

మరో వైపు  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్   కేసులో అరెస్టైన  రాజశేఖర్ రెడ్డి,  కేటీఆర్ పీఏ తిరుపతి గ్రామాలు  పక్క పక్కనే ఉంటాయన్నారు.  ఈ  మండలంలో  పలువురు  గ్రూప్-1 ప్రిలిమ్స్  పరీక్షల్లో  ర్యాంకులు  పొందారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.    రేవంత్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో  రాజశేఖర్  స్వగ్రామంలో  రెండు  రోజుల క్రితం  సిట్ బృందం విచారణ  నిర్వహించింది. 

పేపర్ లీక్ అంశానికి సంబంధించి  నిన్న కాంగ్రెస్ ప్రతినిధి బృందం  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు  వినతి పత్రం  సమర్పించింది.  కేటీఆర్  ను  భర్తరఫ్  చేసేందుుకు అనుమతివ్వాలని  కాంగ్రెస్ నేతలు  కోరారు.

also read:నేడు సిట్ విచారణకు రేవంత్ రెడ్డి: కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులు

గతంలో  టీఎస్‌పీఎస్‌సీ  నిర్వహించిన  ప్రశ్నలకు  సంబంధించిన  పేపర్లు కూడా లీకయ్యాయా  అనే  కోణంలో కూడ సిట్ అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు.  ఈ కేసులో  అరెస్టైన  నిందితుల  బ్యాంకు ఖాతాలను కూడా సిట్ అధికారులు  పరిశీలిస్తున్నారు.  

పేపర్ లీక్ అంశం  తెరమీదికి రావడంతో  ఇప్పటికే  జరిగిన  నాలుగు పరీక్షలను  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు  చేసింది.  మరో రెండు పరీక్షలను వాయిదా వేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios