Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా ఐదువేల కేసులు, 15మరణాలు

గత శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 1,29,637మందికి కరోనా టెస్టులు చేయగా 5093మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

today 18th april corona cases in telangana akp
Author
Hyderabad, First Published Apr 18, 2021, 10:19 AM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,29,637మందికి కరోనా టెస్టులు చేయగా 5093మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,51,424కు చేరితే టెస్టుల సంఖ్య 1,17,37,753కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 1555మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,12,563కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,037యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 24,156గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 15 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1824కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.51శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 86.6శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 88.94శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 86, నాగర్ కర్నూల్ 101, జోగులాంబ గద్వాల 31, కామారెడ్డి 232, ఆదిలాబాద్ 92, భూపాలపల్లి 25, జనగామ 44, జగిత్యాల 223, అసిఫాబాద్ 32, మహబూబ్ నగర్ 168, మహబూబాబాద్ 57, మెదక్ 101, నిర్మల్ 139, నిజామాబాద్ 367,  సిరిసిల్ల 106, వికారాబాద్ 122, వరంగల్ రూరల్ 60,  ములుగు 22, పెద్దపల్లి 79, సిద్దిపేట 117, సూర్యాపేట 88, భువనగిరి 80, మంచిర్యాల 124, నల్గొండ 139 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 743కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 488, రంగారెడ్డి 407, కొత్తగూడెం 84, కరీంనగర్ 149, ఖమ్మం 155, సంగారెడ్డి 232, వరంగల్ అర్బన్ 175కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:   

 

Follow Us:
Download App:
  • android
  • ios