Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ కరోనా అప్ డేట్: 30వేలకు చేరిన యాక్టివ్ కేసులు, ఆ జిల్లాల్లోనే అత్యధికం

గత 24గంటల్లో అంటే బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,21,880మందికి కరోనా టెస్టులు చేయగా 3840మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

today 16th april corona cases in telangana akp
Author
Hyderabad, First Published Apr 16, 2021, 10:18 AM IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,21,880మందికి కరోనా టెస్టులు చేయగా 3840మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,41,885కు చేరితే టెస్టుల సంఖ్య 1,14,81,881కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 1198మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 20,215గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో తొమ్మిది మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1797కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.52శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 87.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 90.55శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 75, నాగర్ కర్నూల్ 60, జోగులాంబ గద్వాల 26, కామారెడ్డి 144, ఆదిలాబాద్ 85, భూపాలపల్లి 16, జనగామ 48, జగిత్యాల 167, అసిఫాబాద్ 23, మహబూబ్ నగర్ 124, మహబూబాబాద్ 24, మెదక్ 64, నిర్మల్ 159, నిజామాబాద్ 303,  సిరిసిల్ల 88, వికారాబాద్ 69, వరంగల్ రూరల్ 45,  ములుగు 14, పెద్దపల్లి 66, సిద్దిపేట 86, సూర్యాపేట 57, భువనగిరి 70, మంచిర్యాల 101, నల్గొండ 116 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 505కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 407, రంగారెడ్డి 302, కొత్తగూడెం 54, కరీంనగర్ 124, ఖమ్మం 111, సంగారెడ్డి 175, వరంగల్ అర్బన్ 114కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:   

 

Follow Us:
Download App:
  • android
  • ios