విషాదం: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ముగ్గురు యువకులు మృతి
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఐదుగురు యువకులు ప్రాజెక్టులో స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు మృతి చెందగా, ఇద్దరిని స్థానికులు కాపాడారు.
నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం మధ్యాహ్నం ఐదుగురు యువకులు ప్రాజెక్టులో స్నానానికి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ముగ్గురు యువకులు నీటమునిగి మృతి చెందగా, ఇద్దరిని స్థానికులు కాపాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను అర్వపల్లికి చెందిన ఉదయ్, రాహుల్, గట్టు శివగా గుర్తించారు.