Asianet News TeluguAsianet News Telugu

నల్గొండ లో ఉద్రిక్తత: బీహర్, స్థానిక లేబర్ల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి

నల్గొండ పట్టణంలోని భాస్కర్ టాకీస్ లేబర్ అడ్డా వద్ద  బీహర్, స్థానికుల వర్కర్లకు మధ్య ఆదివారం నాడు ఘర్షణ చోటు చేసుకుంది.ఇరు వర్గాలు  రాళ్ల దాడికి దిగారు.  
 

Tension Prevails After  Clashes Between Bihar and Nalgonda Workers
Author
First Published Oct 2, 2022, 10:26 AM IST

నల్గొండ: పట్టణంలోని భాస్కర్ టాకీస్ లేబర్ అడ్డా వద్ద ఆదివారం నాడు  బీహర్, స్థానిక కూలీల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలు రాళ్ల దాడికి దిగాయి. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే భాస్కర్ టాకీస్ లేబర్ అడ్డా వద్దకు చేరుకుని  పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. పని విషయమై స్థానిక కూలీలు, బీహర్ కూలీల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఈ వాగ్వాదం రాళ్ల దాడికి దారితీసింది. స్థానిక కూలీలపై బీహార్ కూలీలు రాళ్లతో దాడికి దిగారు. ఎదురు దాడికి స్థానిక కూలీలు ప్రయత్నించారు. కానీ బీహర్ కూలీల రాళ్లదాడితో స్థానిక కూలీలు అక్కడి నుండి పారిపోయారు.   రాళ్లదాడితో ఈ దారి గుండా వెళ్ళిన పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios