Asianet News TeluguAsianet News Telugu

సంతోష్‌నగర్ బ్యాంకు నుండి రూ. 8 కోట్లు మాయం: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్‌పై మరో ఫిర్యాదు


తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ పై ఫిర్యాదు అందింది. సంతోష్ నగర్ లో రూ. 8 కోట్లు మాయమయ్యాయి. తెలుగు అకాడమీ అధికారులు  ఇచ్చిన పిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీంతో తెలుగు అకాడమీలో మొత్తం రూ. 51 కోట్లకు చేరిందని  తెలుగు అకాడమీ అధికారులు తెలిపారు.

Telugu Akademi funds missing: Rs.8 crore funds goes missing from santosh nagar Union bank
Author
Hyderabad, First Published Sep 30, 2021, 2:26 PM IST


హైదరాబాద్: తెలుగు అకాడమీ (telugu akademi) నిధుల (funds)గోల్ మాల్ పై  పోలీసులకు మరో ఫిర్యాదు అందింది.సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ (union bank)నుండి రూ. 8 కోట్లు  మాయమయ్యాయని ఫిర్యాదు అందింది.దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.తెలుగు అకాడమీ అధికారులు  ఇచ్చిన పిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దీంతో తెలుగు అకాడమీలో మొత్తం రూ. 51 కోట్లకు చేరిందని  తెలుగు అకాడమీ అధికారులు తెలిపారు.కార్వాన్, సంతోష్ నగర్ యూనియన్ బ్యాంక్ నుండి నిధుల మాయమయ్యాయి.  బ్యాంక్ మేనేజర్ తో పాటు అధికారుల హస్తం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

also read:నిధుల గోల్ మాల్ పై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ... తెలుగు అకాడమీ తెలంగాణ ఉద్యోగసంఘం డిమాండ్

యూబీఐలో తాము డిపాజిట్‌ చేసిన రూ.43 కోట్లు బ్యాంక్‌లో లేవని అకాడమీ ప్రతినిధులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌, అకౌంట్స్‌ ఆఫీసర్‌  రాంబాబు, జేడీ యాదగిరితో కూడిన కమిటిని నియమించింది. అక్టోబరు 2లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.   

తెలుగు అకాడమీలోని వ్యక్తులే వాటిని విత్‌డ్రా చేసుకున్నారని యూబీఐ ఉన్నతాధికారులు సోమవారం పోలీసులకు తెలిపారు. హైదరాబాద్‌ హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ కొద్దిరోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ.43 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లున్నాయని తేలింది. అయితే గడువు తీరకముందే వాటిని తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 21న డిపాజిట్‌ పత్రాలు బ్యాంకుకు చేరినా అటువైపు నుంచి సమాచారం లేకపోవడంతో మూడు రోజుల తర్వాత తెలుగు అకాడమీ ఉద్యోగి రఫీక్‌ నేరుగా బ్యాంకుకు వెళ్లి ఆరా తీశారు. ఈ క్రమంలో ఆగస్టులోనే రూ.43 కోట్లు విత్‌డ్రా అయ్యాయని బ్యాంకు అధికారులు ఆయన తెలియజేశారు. దీనిపై అకాడమీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకూ తెలుగు అకాడమీ అధికారులు వివిధ దశల్లో రూ.43 కోట్లు డిపాజిట్‌ చేశారు. అనంతరం ఆగస్టులో యూబీఐ శాఖల నుంచి విత్‌డ్రా చేసుకుని హైదరాబాద్‌లోని రెండు సహకార బ్యాంకుల్లో రూ. 11.37 కోట్లు డిపాజిట్‌ చేశారు. రూ.5.70 కోట్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలుగు అకాడమీ ఖాతాకు బదిలీ చేశారు. మిగిలిన రూ.26 కోట్లు తెలుగు అకాడమీ అధికారులు విత్‌డ్రా చేసుకున్నారు. సరైన అధికారిక పత్రాలు చూసిన తర్వాతే నగదు ఇచ్చాం’’ అని బ్యాంకు అధికారులు పోలీసులకు తెలిపారు. 

ఈ వివాదం నేపథ్యంలో బదిలీ అయిన సొమ్ము ఎవరూ విత్‌డ్రా చేయకుండా చూడాలని ఒక సహకార బ్యాంకుకు లేఖ రాయగా.. కేవలం రూ.5 లక్షలే ఉన్నాయని చెప్పారని యూబీఐ అధికారులు పోలీసులకు తెలియజేశారు. బ్యాంకు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం డిపాజిట్‌ సొమ్ము ఆగస్టులోనే వేరే చోటుకు మారింది. అంటే అప్పుడు సమర్పించిన డిపాజిట్‌ పత్రాలు కానీ లేదా సెప్టెంబరు 21న పంపినవి కానీ నకిలీవి అయి ఉండాలని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకు అధికారులేమో సరైన అధికారిక పత్రాలు చూశాకే డిపాజిట్‌ సొమ్ము చెల్లించామని ఎంతో స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్బును విత్‌డ్రా చేసింది ఎవరో తేలాల్సి ఉంది.  

Follow Us:
Download App:
  • android
  • ios