Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ స్కూళ్లలో పోస్టుల భర్తీ కోరుతూ మంత్రి సబితా కార్యాలయం ముట్టడి

హైద్రాబాద్‌ నగరంలోని బషీర్‌బాగ్‌లో  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  కార్యాలయాన్ని తెలంగాణ నిరుద్యోగ  జేఏసీ  ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ముట్టడించారు. ఖాళీగా  ఉన్న ప్రభుత్వ  స్కూళ్లలోని పోస్టులను భర్తీ చేయాలనని డిమాండ్  చేశారు.
 

telanganana nirudyoga jac conducts  protest  infront of  minister  Sabitha indra  Reddy office
Author
First Published Dec 2, 2022, 2:30 PM IST

హైదరాబాద్: నగరంలోని  బషీ‌ర్‌బాగ్ లో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  కార్యాలయాన్ని  తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు ముట్టడించారు. ఈ  ఆందోళన కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం నేత, వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లోని  24వేల పోస్టులను భర్తీ చేయాలని  ఆందోళనకారులు డిమాండ్  చేశారు.

రాష్ట్రంలో  ఖాళీగా  ఉన్న  ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ  జేఏసీ డిమాండ్  చేసింది. రాష్ట్రంలో  అధికారంలోకి రాకముందు  ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ సర్కార్  అమలు చేయాలని నిరుద్యోగ  జేఏసీ డిమాండ్  చేసింది. రాష్ట్రంలో  నిరుద్యోగ యువత  ప్రభుత్వ  ఉద్యోగాల  కోసం  ఎదురుచూస్తున్నారన్నారు. ఖాళీగా  ఉన్న ప్రభుత్వ  ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా  ప్రభుత్వం  అన్ని చర్యలు తీసుకోవాలని   ఆందోళనకారులు డిమాండ్  చేశారుఈ విషయమై ప్రభుత్వం నుండి  స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios