Asianet News TeluguAsianet News Telugu

మునుగోడు బైపోల్ 2022: పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది.ఈ విషయమై  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఇవాళ ఈ మేరకు ప్రకటన చేశారు. 

Telangana TDP Decides To not to Contest In Munugode Bypoll 2022
Author
First Published Oct 13, 2022, 12:48 PM IST

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ స్థానం నుండి పోటీ చేయాలని టీడీపీ నాయకత్వం భావించినట్టుగా ఆపార్టీ వర్గాల్లో ప్రచారం సాగింది. అయితే చివరి నిమిషంలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.  ఎన్నికల్లో  ఏపార్టీకి కూడా మద్దతు  ఇవ్వవద్దని ఆ పార్టీ నిర్ణయం తీసుకుందని  టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ప్రకటించారు.

 గత వారంలో టీడీపీకి చెందిన నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారుమునుగోడు ఉప ఎన్నిక విషయమై చర్చించారు. అయితే ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.  2004 ఎన్నికల్లో ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా చిలువేరు కాశీనాథ్ పోటీ  చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ  అభ్యర్ధి కాశీనాథ్ గణనీయమైన ఓట్లను సాధించారు. ఇదిలా ఉంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే  విషయమై టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దృష్టి పెట్టారు. ఈ నెల 15వ తేదీన హైద్రాబాద్ ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలానికి చెందిన జక్కలి అయిలయ్య యాదవ్ ను ఈ స్థానం నుండి బరిలోకి దింపాలని భావించారు.  అయిలయ్య యాదవ్ సంస్థాన్ నారాయణపురం మండలంలోని ఓ గ్రామానికి గతంలో సర్పంచ్ గా పనిచేశాడు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయిలయ్య యాదవ్ కొనసాగుతున్నాడు. అయితే  ఇవాళ జక్కలి అయిలయ్య యాదవ్ పేరును ప్రకటించాలని భావించారు. కానీ చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకోవాలని  టీడీపీ నిర్ణయం తీసుకుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios