కేటీఆర్ సారధ్యంలో మరో అద్భుతం... మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం

telangana municipal elections live updates

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల  కౌటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 9 కార్పోరేషన్లలో ఇటీవలే పోలింగ్ ముగియగా ఇవాళ ఫలితాలు వెలవడనున్నాయి. బ్యాలెట్ బాక్సుల్లో వున్న అభ్యర్ధుల భవితవ్యం శనివారం ఉదయం నుండి ఒక్కోటిగా బయటపడుతోంది.   

5:22 PM IST

నారాయణపేట్ లో హోరాహోరీ... టీఆర్ఎస్ కు బిజెపి గట్టి పోటీ

నారాయణపేట్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, బిజెపి ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇవాళ వెలువడిన  ఫలితాల్లో  టీఆర్ఎస్ 10 వార్డులు గెలుచుకోగా బిజెపి 9 వార్డుల్లో విజయాన్ని సాధించింది.   ఇక కాంగ్రెస్ 2, ఇతరులు 3  వార్డులు  గెలుచుకున్నారు. 

5:08 PM IST

తాము కాదు ఈ ఫలితాలే బిజెపి బుద్దిచెబుతాయి..:  మంత్రి ఎర్రబెల్లి

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయినా బిజెపి బుద్ది తెచ్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. అభివృద్ది ప్రాజెక్టులపై కేసులు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తెలంగాణకు వస్తున్నాయన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు మరోసారి తేల్చారన్నారు. ఈ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు, గెలుపొందిన అభ్యర్ధులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

4:44 PM IST

మున్సిపల్ ఎలక్షన్స్ టీఆర్ఎస్ హవా... కేటీఆర్ కు హరీష్ అభినందనలు

''ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.'' అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. 

4:38 PM IST

కామారెడ్డిలో తేలని ఫలితం... మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో టీఆర్ఎస్

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చారు. ఇక్కడ ఏ పార్టీ కూడా ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయాయి. అధికార టీఆర్ఎస్ కేవలం రెండు వార్డుల దూరంలో నిలిచిపోయింది. 

కామారెడ్డిలో మొత్తం 49 వార్డులకుగానూ  టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ కు 12, బిజెపి 8, ఇండిపెండెంట్లు 6 వార్డులను కైవసం చేసుకున్నారు. 
 

4:27 PM IST

కేసీఆర్, కేటీఆర్ లే మా నాయకులు..: మాజీ మంత్రి జూపల్లి

కొల్లాపూర్, ఐజ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయలు సత్తాచాటారు.  ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలోకి దిగిన జూపల్లి వర్గం రెండు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జూపల్లి  మాట్లాడుతూ... తాము టీఆర్ఎస్ రెబల్స్ కాదు టీఆర్ఎస్ నాయకులమేనని అన్నారు. తామింకా టీఆర్ఎస్ పార్టీలోనే వున్నామని... తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ లేనని ఆయన స్పష్టం చేశారు. మిగతా  విషయాలు టీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానని జూపల్లి అన్నారు. 

4:12 PM IST

పెద్ద అంబర్‌పేట్ హస్తగతం... టీఆర్ఎస్ కు తప్పని ఓటమి

హైదరాబాద్ శివారులోని  పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీని కాదని ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ హస్తగతం చేశారు. 

4:06 PM IST

మహిళా కౌన్సిలర్ కిడ్నాప్...: ఎలక్షన్ కమీషన్ కు రేవంత్ రెడ్డి ఫిర్యాదు

కోస్గి మున్సిపాలిటీ 16వ వార్డు నుండి గెలుపొందిన ఎల్లమ్మ అనే మహిళను స్వయంగా జిల్లా ఎస్పీ బలవంతంగా తీసుకెళ్లారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక కాంట్రాక్టర్ ఇంటికి స్వయంగా పోలీసులే ఆమెను తీసుకెళ్లారని... అక్కడ ఆమెను ప్రలోభాలకు గురిచేశారంటూ రేవంత్ ఆరోపించారు.
 

3:55 PM IST

తృటిలో చేజారిన మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ కన్ను... ప్రయోగించే అస్త్రమిదే

తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే తొంబై శాతానికి  పైగా  మున్సిపాలిటీల్లో విజయాన్ని అందుకున్న ఆ పార్టీ టఫ్ ఫైట్ వున్నచోట ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించుకుని ఛైర్మన్ పీఠం టీఆర్ఎస్ కే దక్కేలా ఎత్తులు వేస్తోంది.  నారాయణఖేడ్, అరమచింత, హాలియా, యాదగిరిగుట్ట, మక్తల్, బోడుప్పల్, కొంపల్లి, ఖానాపూర్, కోస్గిలలో కేవలం ఒకటి రెండు వార్డుల తేడా మాత్రమే వున్నందున ఇక్కడ ఎక్స్ అఫిషోయో ఓట్లను ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఎక్స్ అపిషియో ఓటేసే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జాబితాను సిద్దం చేసి సాయంత్రం ఈసీకి అందించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 
 

3:42 PM IST

ఫ్యామిలీ సెంటిమెంట్... సంగారెడ్డిలో పారని జగ్గారెడ్డి వ్యూహం

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్ధానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీఆర్ఎస్ షాకిచ్చింది. పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్ధి అయిన ఎమ్మెల్యే సతీమణి నిర్మలా జగ్గారెడ్డి కౌన్సిలర్ గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ చేజారింది.  

సంగారెడ్డి లో మొత్తం 38 వార్డుల్లో టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 12, ఎంఐఎం, బిజెపి చెరొకటి గెలుచుకోగా మిగతాచోట్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు.    

3:21 PM IST

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

కొత్తపల్లి మున్సిపాలిటీ : 12
తెరాస : 11
కాంగ్రెస్ : 01
బీజేపీ :00
ఇతరులు :00

జమ్మికుంట మున్సిపాలిటీ:30
తెరాస : 22
కాంగ్రెస్ :03
బీజేపీ :00
ఇతరులు :05

హుజురాబాద్ మున్సిపాలిటీ : 30
తెరాస : 21
కాంగ్రెస్ :01
బీజేపీ :05
ఇతరులు :03

చొప్పదండి మున్సిపాలిటీ :14
తెరాస : 09
కాంగ్రెస్ :02
బీజేపీ :02
ఇతరులు :01

జగిత్యాల జిల్లా

జగిత్యాల మున్సిపాలిటీ : 48
తెరాస : 30
కాంగ్రెస్ : 07
బీజేపీ : 03
ఇతరులు : 08

ధర్మపురి మున్సిపాలిటీ : 15
తెరాస : 08
కాంగ్రెస్ :07
బీజేపీ :00
ఇతరులు :00

రాయికల్ మున్సిపాలిటీ :12
తెరాస : 09
కాంగ్రెస్ :01
బీజేపీ :01
ఇతరులు :01

కోరుట్ల మున్సిపాలిటీ : 33
తెరాస : 21
కాంగ్రెస్ : 02
బీజేపీ :05
ఇతరులు : 05

మెట్టుపల్లి మున్సిపాలిటీ : 26

తెరాస : 17
కాంగ్రెస్ : 01
బీజేపీ :04
ఇతరులు :04

పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి మున్సిపాలిటీ :36
తెరాస : 24
కాంగ్రెస్ :4
బీజేపీ :2
ఇతరులు :6

సుల్తానాబాద్ మున్సిపాలిటీ.. 15

తెరాస : 9
కాంగ్రెస్ :6


మంథని మున్సిపాలిటీ :13..
తెరాస : 12
కాంగ్రెస్ :1


సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల మున్సిపాలిటీ : 39 
తెరాస : 22
కాంగ్రెస్ :02
బీజేపీ :03
ఇతరులు :12

వేములవాడ మున్సిపాలిటీ : 28
తెరాస : 16
కాంగ్రెస్ : 01
బీజేపీ :06
ఇతరులు :05

3:16 PM IST

హంగ్ దిశగా రామగుండం కార్పోరేషన్

రామగుండం మున్సిపాలిటీ ప్రజలు వినూత్నమైన ఫలితాన్నిచ్చారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని అందించలేదు. మొత్తం 50 డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 19 సాధించగా బిజెపి 15, కాంగ్రెస్ 11, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో పొత్తులు లేకుండా మేయర్ అభ్యర్థిని ఎన్నుకునే పరిస్థితులు కనిపించడం లేదు. 

 

3:04 PM IST

నిజామాబాద్ కార్పోరేషన్ లో ఉత్కంఠ...కౌటింగ్ కేంద్రం వద్ద భారీ  బందోబస్తు

నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సమానంగా నిలిచాయి. ఈ మూడు పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారరు.  

2:55 PM IST

నిర్మల్ లో టీఆర్ఎస్ ఘన విజయం...

నిర్మ‌ల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ అఖండ‌ విజయం సాధించింది. 30 వార్డుల్లో  టీఆర్ఎస్ 7 స్థానాల‌తో కాంగ్రెస్, 2 స్థానాల‌తో ఎంఐఎం, 1 స్థానంతో బీజేపీ లు స‌రిపెట్టుకున్నాయి.   2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలుపొందారు.  

ఈ ఫలితంపై మంత్రి అల్లోల‌ ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ  నిర్మ‌ల్ మున్సిపాలిటీలో అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 30 వార్డుల్లో  టీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌యానికి స‌మిష్టి కృషి చేసిన‌ నాయకులకు, కార్యకర్తలను ఈ సంద‌ర్బంగా అభినందించారు.

2:51 PM IST

నేరేడుచెర్లలో సగం సగం... సిపిఐ చేతిలోనే తుది ఫలితం

నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆసక్తికరమైన  ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 7, టీఆర్ఎస్ 7 వార్డులను గెలుచుకుని సమానంగా నిలవగా ఓ వార్డులో సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డ కాంగ్రెస్ అతన్ని క్యాంపుకు తరలించింది. అయితే టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫిషియో సభ్యులను ఉపయోగించుకుని ఈ స్ధానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 
 

2:39 PM IST

బిజెపి ఖాతాలో రెండోది... మక్తల్ లో ఘన విజయం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ చేరింది. ఇప్పటికే అమన్ గల్ స్ధానాన్ని కైవసం చేసుకున్న కమళదళం తాజాగా మక్తల్ మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇలా మొత్తంగా బిజెపి రెండు  మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగరేసింది. 
 

2:31 PM IST

ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం... కౌంటింగ్ కేంద్రం వద్ద కోమటిరెడ్డి ఆందోళన

ఇండిపెండెంట్ అభ్యర్థి కాటంరాజు కోసం భువనగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదాని దిగారు.  కౌంటింగ్ కేంద్రం వద్దే ధర్నాకు కూర్చోడానికి ప్రయత్నించగా పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.  అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల  నేపథ్యంలో కాటంరాజును పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. 

2:22 PM IST

వాటివల్లే టీఆర్ఎస్ అఖండ విజయం: గంగుల

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఘన విజయం అందుకోడానికి కారణమని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయన్నారు. ప్రతిపక్ష పార్టీల కంటే టీఆర్ఎస్ రెబల్  అభ్యర్ధులే ఎక్కువ స్థానాల్లో గెలిచారన్నారు. ఈ ఫలితం ద్వారా మరోసారి ప్రజలు తమవెంటే వున్నారని నిరూపితమైందని  గంగుల పేర్కొన్నారు. 

2:12 PM IST

జై కేసీఆర్... మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కవిత కామెంట్స్

తెలంగాణలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్  కూతురు కల్వకుంట కవిత ట్విట్టర్ వేధికన స్పందించారు.  ''మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకే కాకుండా పార్టీ గెలుపుకోసం కృషిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఒక్కరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. జై తెలంగాణ... జై టీఆర్ఎస్... జై కేసీఆర్.'' అంటూ కవిత ట్వీట్ చేశారు. 

1:44 PM IST

ఓటమిపాలైన అభ్యర్ధులను గదిలో బందించి...  సిరిసిల్లలో  పోలీసుల ఓవరాక్షన్

సిరిసిల్లలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తూ తమ పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఓటమిపాలైన అభ్యర్ధులు వాపోయారు. ఓటమిపాలైన అభ్యర్ధులను కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లనివ్వకుండా ఓ గదిలో పెట్టారని అన్నారు. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకూడదనే తాము ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

1:28 PM IST

దుబ్బాకలో విచిత్రమైన ఫలితం...

ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితం వెలువడింది. ఇక్కడ 20  వార్డులకు గాను 10 వార్డుల్లో ఇండిపెండెంట్లు, 9 వార్డుల్లో టీఆర్ఎస్, 1 చోటు బిజెపి అభ్యర్ధి విజయం సాధించారు. ఇలా ఏ పార్టీకి స్ఫష్టమైన ఆధిక్యం లభించకుండా ఇండిపెండెంట్లు ఆధిక స్థానాలు  గెలుచుకున్నారు. 
 

1:21 PM IST

జనగామలో వేడెక్కిన రాజకీయం.... కాంగ్రెస్ క్యాంప్ కు టీఆర్ఎస్ రెబల్స్

జనగామ మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  ఇక్కడ  కాంగ్రెస్, టీఆర్ఎస్ ల పార్టీలు ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి తో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి చూపిస్తోంది. అలాగే ఇప్పటికే ఇద్దరు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్ క్యాంప్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఛైర్మన్ పీఠానికి మూడు స్థానాలకు దూరంలో నిలిచిన టీఆర్ఎస్ కూడా రాజకీయ ఎత్తులకు సిద్దమైంది. 
 

1:12 PM IST

ఇల్లందులో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇక్కడ మొత్తం 24 వార్డులకు గాను 19 స్థానాల్లో టీఆర్ఎస్, 5 వార్డుల్లో ఇండిపెండెంట్లు  గెలుపొందారు. వీరిలో కూడా అత్యధికులు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులే. ఇక కాంగ్రెస్, బిజెపి పార్టీలు  ఖాతా కూడా తెరవలేదు. 

1:08 PM IST

ఇది కేసీఆర్ పై నమ్మకం మాత్రమే: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై హరీష్

ప్రత్యర్థులు అందుకోలేని విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ సాధించడం చాలా ఆనందాన్నిస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్తకర్తలను ఆయన అభినందనలు తెలిపారు. అయితే బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని నమ్ముతున్నట్లు ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించారని హరీష్ అన్నారు. 
 

1:03 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు షాక్...

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ షాకిచ్చింది. మంథని మున్సిపాలిటీని దక్కించుకున్న టీఆర్ఎస్ ఉమ్మెల్యే ఆధిపత్యానికి గండి కొట్టింది. 

12:59 PM IST

అమరచింత మిశ్రమ ఫలితం...

అమరచింత మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితం  వెలువడింది. అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. అధికార  టీఆర్ఎస్ 3, టిడిపి  1, కాంగ్రెస్ 2, సిపిఐ 1, బిజెపి 1, ఇండిపెండెంట్ 1 వార్డులో గెలుపొందారు. 

12:43 PM IST

జల్ పల్లిలో టీఆర్ఎస్, ఎంఐఎం ల మధ్యే పోటీ

జల్ పల్లిలో మున్సిపాలిటీలో పోటీ కేవలం టీఆర్ఎస్, ఎంఐఎం ల మధ్యే కొనసాగుతోంది. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు కనీసం పోటీలో కూడా నిలవలేదు. 

12:41 PM IST

స్వతంత్ర అభ్యర్ధి కోసం... యాదగిరిగుట్టలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల  తోపులాట

యాదరిగిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన కాటం రాజును దక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో  కౌంటింగ్ కేంద్రం వద్దే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అతడికి కలుసుకోడానికి ఒకేసారి  ఇరు పార్టీల నాయకులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే రాజును సురక్షితంగా  కౌంటింగ్ కేంద్రంలోకి పోలీసులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. 
 

12:18 PM IST

కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో ఆసక్తికరమైన ఫలితం

కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. మొత్తం 39 వార్డుల్లో 24 టీఆర్ఎస్, 10 ఇండిపెండెంట్, బిజెపి 3, కాంగ్రెస్ 2 గెలుచుకున్నాయి. ఇక్కడినుండి గెలుపొందిన 10 మంది ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ రెబల్సే కావడం విశేషం. 

12:11 PM IST

చిట్యాల పోలింగ్ కేంద్ర వద్ద ఉద్రిక్తత... టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్  కేంద్రంవద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.  కౌంటింగ్ కేంద్రంలోకి  నార్కట్ పల్లి  ఎంపీపీని అధికారులు అనుమతించకపోవడం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.  అధికారుల తీరుపై  కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. 
 

11:59 AM IST

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి విజయం

సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది. అయితే కాంగ్రెస్ నుండి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా ప్రచారంలో వున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గెలుపొందారు. మొత్తంగా ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్ధులు ఇప్పటివరకు గెలుపొందారు. 

11:49 AM IST

తుక్కుగూడలో బిజెపి హవా... టీఆర్ఎస్ ఛైర్మన్ అభ్యర్ధి ఓటమి

తుక్కుగూడ మున్సిపాలిటీ ఫలితాల్లో బిజెపి హవా  కొనసాగుతోంది. ఇక్కడ టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నబిజెపి ఈ మున్సిపాలిటీని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

11:43 AM IST

బోడుప్పల్ లో ఉత్కంఠ...ఓటమిఅంచుల్లో టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థి

హైదరాబాద్ శివారు ప్రాంతమైన బోడుప్పల్ లో మిక్స్‌డ్ రిజల్ట్స్  వెలువడుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్ధిగా ప్రకటించిన మందా సంజీవరెడ్డిని ప్రకటించగా అతడు ఓటమి అంచుల్లో నిలిచాడు. అంతేకాకుండా 5,6 స్థానాల్లో కాంగ్రెస్  ఆధిక్యం కనబరుస్తోంది. టీఆర్ఎస్ కూడా మరో ఐదారు వార్డుల్లోనే  ఆధిక్యాన్ని కలిగివుంది. ఇప్పటివరకు ఇక్కడినుండి ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు  అధికార టీఆర్ఎస్ కు కాస్త వ్యతిరేకంగానే వున్నాయని చెప్పాలి. 
 

11:36 AM IST

మోత్కూరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ...

మోత్కూరులో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక్కడ ఇప్పటివరకు ఆరు వార్డుల్లో టీఆర్ఎస్, ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మరో వార్డులో కౌంటింగ్ కొనసాగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. 

11:33 AM IST

జనగాంలో కాంగ్రెస్ ఆధిక్యం

జనగాం మున్సిపాలిటీలో  కాంగ్రెస్ ముందంజలో వుంది. 

11:30 AM IST

కోస్గిలో కాంగ్రెస్ ముందంజ

కొడంగల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజలో వున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహించాడు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా వున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున   కొడంగల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు.  
 

11:21 AM IST

భైంసాలో బిజెపి, ఎంఐఎం మధ్యే హోరాహోరీ...

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భైంసాలో విచిత్రమైన పోరు సాగుతోంది. ఇక్కడ అధికార పార్టీ అసలు పోటీలోనే లేకుండా పోయింది. ఇక్కడ  ఎంఐఎం, బిజెపిల మధ్యే ప్రదానంగా పోటీ సాగుతోంది. ఇక్కడ బిజెపి 6, ఎంఐఎం 7 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పోటీలో నిలవలేదు. 

11:10 AM IST

పీర్జాదిగూడలో టీఆర్ఎస్ ముందంజ

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ లో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో వుంది. 

11:07 AM IST

వేములవాడలో అధికార పార్టీదే  విజయం

సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. 

11:02 AM IST

వడ్డేపల్లిలో టీఆర్ఎస్ బొక్కబోర్లా... కాంగ్రెస్ భారీ విజయం

గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.  మొత్తం 10 వార్డులకు గాను కాంగ్రెస్ ఏకంగా 9 చోట్ల విజయం సాధించింది. అధికార  టీఆర్ఎస్ కేవలం ఒక్కచోట మాత్రమే గెలుపొందింది. 

10:57 AM IST

ఐజాలో టీఆర్ఎస్ రెబల్స్ హవా... పట్టునిలుపుకున్న జూపల్లి

ఐజా మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం గెలెచుకుంది. టీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో తన వర్గీయులను స్వతంత్రంగా పోటీకి దించారు జూపల్లి. ఇలా టీఆర్ఎస్ రెబల్స్ గా బరిలోకి దిగిన అభ్యర్ధులు అత్యధిక వార్డుల్లో  గెలుపొందారు. 

10:52 AM IST

పరకాలలో టీఆర్ఎస్ విజయం

ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. మొత్తం 22 వార్డుల్లో 15 టీఆర్ఎస్,5  కాంగ్రెస్,  2 బిజెపి గెలుచుకుంది.

10:49 AM IST

ఉమ్మడి నిజామాబాద్ టీఆర్ఎస్ దే

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇక్కడ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. 

10:46 AM IST

యాదగిరిగుట్టలో కాంగ్రెస్ దే పైచేయి

యాదిగిరిగుట్ట మున్సిపాలిటీలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి.  ఇక్కడ మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 9,  టీఆర్ఎస్ 3 వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. 

10:39 AM IST

అందోల్ టీఆర్ఎస్ వశం

సంగారెడ్డి  జిల్లా అందోల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించంది. టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6 ఇతరులు 1 స్థానాలో గెలుపొందారు.

10:36 AM IST

అమన్ గల్ లో బిజెపి ముందంజ

అమన్ గల్ మున్సిపాలిటీ ఆరు వార్డుల్లో బిజెపి పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 

10:34 AM IST

నారాయణఖేడ్ లో టీఆర్ఎస్ కు షాక్... కాంగ్రెస్ దే పైచేయి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది.  మొత్తం  17 వార్డులకు గాను కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపొందాయి. 

10:29 AM IST

కొల్హాపూర్ లో టీఆర్ఎస్ రెబల్స్ హవా... ఆరుచోట్ల జూపల్లి వర్గీయుల గెలుపు

కొల్హాపూర్ మున్సిపాలిటీలోని ఇరు వార్డుల్లో టీఆర్ఎస్ రెబల్స్ ఇరుచోట్ల గెలుపొందారు. దీంతో గెలుపొందిన అభ్యర్ధులు చేజారకుండా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని క్యాంపుకు తరలిస్తున్నట్లు సమాచారం. 

10:25 AM IST

కొత్తపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఘన విజయం

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.    మొత్తం 12 వార్డులకు గాను 11 టిఆర్ఎస్, కేవలం 1 కాంగ్రెస్ గెలుపొందింది. 

10:20 AM IST

జవహర్ నగర్, మీర్ పేట కార్పోరేషన్స్ లో టీఆర్ఎస్ విజయం

హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.  అలాగే మీర్ పేట్ కార్పోరేషన్ ను కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది.  

10:17 AM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ హవా

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్ గల్, బాన్సువాడ, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది.

10:14 AM IST

మరిపెడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయం

వరంగల్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.  

10:11 AM IST

ధర్మపురిలో హోరాహోరీ... చివరకు టీఆర్ఎస్ దే విజయం

ధర్మపురి మన్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు దారితీశాయి. చివరివరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. అయితే కేవలం ఒకే ఒక్క వార్డు తేడాతో టీఆర్ఎస్ పార్టీ  మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.  8 వార్డుల్లో టీఆర్ఎస్, 7 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 

10:07 AM IST

బొల్లారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం

సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో టీఆర్ఎస్ 13 వార్డుల్లో గెలుపొందింది.

10:04 AM IST

దేవరకొండలో టీఆర్ఎస్ విజయం

దేవరకొండ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. 10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయకేతనం ఎగరేశాడు. 

9:58 AM IST

పెద్దపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ విజయకేతనం

పెద్దపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది.మొత్తం వార్డుల్లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1, బిజెపి 1 దక్కించుకున్నాయి. 

9:56 AM IST

పరిగిలో కాంగ్రెస్ బోణీ

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాడు. 

9:53 AM IST

టీఆర్ఎస్ దూకుడు... సూర్యాపేట, మహబూబ్ నగర్ మున్సిపాలిటీల్లో ముందంజ

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా స్పష్టంగా  కనిపిస్తోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను అధికారపార్టీ కైవసం చేసుకోగా సూర్యాపేట, మహబూబ్ నగర్ మున్సిపాలిటీల్లో కూడా ముందంజలో ఉంది. 

9:45 AM IST

వర్ధన్నపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెలిచింది. వర్ధన్నపేటలోని 12 వార్డుల్లో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, బిజెపి 1, స్వతంత్రులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 

5:22 PM IST:

నారాయణపేట్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్, బిజెపి ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇవాళ వెలువడిన  ఫలితాల్లో  టీఆర్ఎస్ 10 వార్డులు గెలుచుకోగా బిజెపి 9 వార్డుల్లో విజయాన్ని సాధించింది.   ఇక కాంగ్రెస్ 2, ఇతరులు 3  వార్డులు  గెలుచుకున్నారు. 

5:08 PM IST:

ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయినా బిజెపి బుద్ది తెచ్చుకోవాలని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. అభివృద్ది ప్రాజెక్టులపై కేసులు వేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని అవార్డులు తెలంగాణకు వస్తున్నాయన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ది సాధ్యమని ఈ ఫలితాల ద్వారా రాష్ట్ర ప్రజలు మరోసారి తేల్చారన్నారు. ఈ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు ఎర్రబెల్లి కృతజ్ఞతలు, గెలుపొందిన అభ్యర్ధులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

4:44 PM IST:

''ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.'' అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. 

4:38 PM IST:

కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లు విభిన్నమైన తీర్పునిచ్చారు. ఇక్కడ ఏ పార్టీ కూడా ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయాయి. అధికార టీఆర్ఎస్ కేవలం రెండు వార్డుల దూరంలో నిలిచిపోయింది. 

కామారెడ్డిలో మొత్తం 49 వార్డులకుగానూ  టీఆర్ఎస్ 23, కాంగ్రెస్ కు 12, బిజెపి 8, ఇండిపెండెంట్లు 6 వార్డులను కైవసం చేసుకున్నారు. 
 

4:26 PM IST:

కొల్లాపూర్, ఐజ మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ రెబల్ గా బరిలోకి దిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయలు సత్తాచాటారు.  ఫార్వర్డ్ బ్లాక్ తరపున బరిలోకి దిగిన జూపల్లి వర్గం రెండు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా జూపల్లి  మాట్లాడుతూ... తాము టీఆర్ఎస్ రెబల్స్ కాదు టీఆర్ఎస్ నాయకులమేనని అన్నారు. తామింకా టీఆర్ఎస్ పార్టీలోనే వున్నామని... తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ లేనని ఆయన స్పష్టం చేశారు. మిగతా  విషయాలు టీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత మీడియాకు వెల్లడిస్తానని జూపల్లి అన్నారు. 

4:12 PM IST:

హైదరాబాద్ శివారులోని  పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడి ప్రజలు అధికార టీఆర్ఎస్ పార్టీని కాదని ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ హస్తగతం చేశారు. 

4:06 PM IST:

కోస్గి మున్సిపాలిటీ 16వ వార్డు నుండి గెలుపొందిన ఎల్లమ్మ అనే మహిళను స్వయంగా జిల్లా ఎస్పీ బలవంతంగా తీసుకెళ్లారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఒక కాంట్రాక్టర్ ఇంటికి స్వయంగా పోలీసులే ఆమెను తీసుకెళ్లారని... అక్కడ ఆమెను ప్రలోభాలకు గురిచేశారంటూ రేవంత్ ఆరోపించారు.
 

3:55 PM IST:

తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగరేసే దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే తొంబై శాతానికి  పైగా  మున్సిపాలిటీల్లో విజయాన్ని అందుకున్న ఆ పార్టీ టఫ్ ఫైట్ వున్నచోట ఎక్స్ అఫిషియో ఓట్లను ఉపయోగించుకుని ఛైర్మన్ పీఠం టీఆర్ఎస్ కే దక్కేలా ఎత్తులు వేస్తోంది.  నారాయణఖేడ్, అరమచింత, హాలియా, యాదగిరిగుట్ట, మక్తల్, బోడుప్పల్, కొంపల్లి, ఖానాపూర్, కోస్గిలలో కేవలం ఒకటి రెండు వార్డుల తేడా మాత్రమే వున్నందున ఇక్కడ ఎక్స్ అఫిషోయో ఓట్లను ఉపయోగించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఎక్స్ అపిషియో ఓటేసే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జాబితాను సిద్దం చేసి సాయంత్రం ఈసీకి అందించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 
 

3:42 PM IST:

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్ధానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీఆర్ఎస్ షాకిచ్చింది. పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్ధి అయిన ఎమ్మెల్యే సతీమణి నిర్మలా జగ్గారెడ్డి కౌన్సిలర్ గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. అత్యధిక స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఛైర్మన్ పీఠం కాంగ్రెస్ చేజారింది.  

సంగారెడ్డి లో మొత్తం 38 వార్డుల్లో టీఆర్ఎస్ 18, కాంగ్రెస్ 12, ఎంఐఎం, బిజెపి చెరొకటి గెలుచుకోగా మిగతాచోట్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు.    

3:21 PM IST:

కొత్తపల్లి మున్సిపాలిటీ : 12
తెరాస : 11
కాంగ్రెస్ : 01
బీజేపీ :00
ఇతరులు :00

జమ్మికుంట మున్సిపాలిటీ:30
తెరాస : 22
కాంగ్రెస్ :03
బీజేపీ :00
ఇతరులు :05

హుజురాబాద్ మున్సిపాలిటీ : 30
తెరాస : 21
కాంగ్రెస్ :01
బీజేపీ :05
ఇతరులు :03

చొప్పదండి మున్సిపాలిటీ :14
తెరాస : 09
కాంగ్రెస్ :02
బీజేపీ :02
ఇతరులు :01

జగిత్యాల జిల్లా

జగిత్యాల మున్సిపాలిటీ : 48
తెరాస : 30
కాంగ్రెస్ : 07
బీజేపీ : 03
ఇతరులు : 08

ధర్మపురి మున్సిపాలిటీ : 15
తెరాస : 08
కాంగ్రెస్ :07
బీజేపీ :00
ఇతరులు :00

రాయికల్ మున్సిపాలిటీ :12
తెరాస : 09
కాంగ్రెస్ :01
బీజేపీ :01
ఇతరులు :01

కోరుట్ల మున్సిపాలిటీ : 33
తెరాస : 21
కాంగ్రెస్ : 02
బీజేపీ :05
ఇతరులు : 05

మెట్టుపల్లి మున్సిపాలిటీ : 26

తెరాస : 17
కాంగ్రెస్ : 01
బీజేపీ :04
ఇతరులు :04

పెద్దపల్లి జిల్లా

పెద్దపల్లి మున్సిపాలిటీ :36
తెరాస : 24
కాంగ్రెస్ :4
బీజేపీ :2
ఇతరులు :6

సుల్తానాబాద్ మున్సిపాలిటీ.. 15

తెరాస : 9
కాంగ్రెస్ :6


మంథని మున్సిపాలిటీ :13..
తెరాస : 12
కాంగ్రెస్ :1


సిరిసిల్ల జిల్లా

సిరిసిల్ల మున్సిపాలిటీ : 39 
తెరాస : 22
కాంగ్రెస్ :02
బీజేపీ :03
ఇతరులు :12

వేములవాడ మున్సిపాలిటీ : 28
తెరాస : 16
కాంగ్రెస్ : 01
బీజేపీ :06
ఇతరులు :05

3:16 PM IST:

రామగుండం మున్సిపాలిటీ ప్రజలు వినూత్నమైన ఫలితాన్నిచ్చారు. ఏ పార్టీకి కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని అందించలేదు. మొత్తం 50 డివిజన్లలో టీఆర్ఎస్ అత్యధికంగా 19 సాధించగా బిజెపి 15, కాంగ్రెస్ 11, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 9 స్థానాలను దక్కించుకున్నాయి. దీంతో పొత్తులు లేకుండా మేయర్ అభ్యర్థిని ఎన్నుకునే పరిస్థితులు కనిపించడం లేదు. 

 

3:04 PM IST:

నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్  లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు బిజెపి, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు సమానంగా నిలిచాయి. ఈ మూడు పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈ ఉత్కంఠ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రానికి ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారరు.  

2:55 PM IST:

నిర్మ‌ల్ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్ అఖండ‌ విజయం సాధించింది. 30 వార్డుల్లో  టీఆర్ఎస్ 7 స్థానాల‌తో కాంగ్రెస్, 2 స్థానాల‌తో ఎంఐఎం, 1 స్థానంతో బీజేపీ లు స‌రిపెట్టుకున్నాయి.   2 వార్డుల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలుపొందారు.  

ఈ ఫలితంపై మంత్రి అల్లోల‌ ఇంద్రకరణ్ రెడ్డి స్పందిస్తూ  నిర్మ‌ల్ మున్సిపాలిటీలో అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 30 వార్డుల్లో  టీఆర్ఎస్ అభ్య‌ర్థుల విజ‌యానికి స‌మిష్టి కృషి చేసిన‌ నాయకులకు, కార్యకర్తలను ఈ సంద‌ర్బంగా అభినందించారు.

2:51 PM IST:

నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆసక్తికరమైన  ఫలితం వెలువడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 7, టీఆర్ఎస్ 7 వార్డులను గెలుచుకుని సమానంగా నిలవగా ఓ వార్డులో సిపిఐ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డ కాంగ్రెస్ అతన్ని క్యాంపుకు తరలించింది. అయితే టీఆర్ఎస్ కూడా ఎక్స్ అఫిషియో సభ్యులను ఉపయోగించుకుని ఈ స్ధానాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 
 

2:39 PM IST:

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి మరో మున్సిపాలిటీ చేరింది. ఇప్పటికే అమన్ గల్ స్ధానాన్ని కైవసం చేసుకున్న కమళదళం తాజాగా మక్తల్ మున్సిపాలిటీని కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇలా మొత్తంగా బిజెపి రెండు  మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగరేసింది. 
 

2:30 PM IST:

ఇండిపెండెంట్ అభ్యర్థి కాటంరాజు కోసం భువనగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇంకా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. తాజాగా కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదాని దిగారు.  కౌంటింగ్ కేంద్రం వద్దే ధర్నాకు కూర్చోడానికి ప్రయత్నించగా పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.  అయితే ఈ ఉద్రిక్త పరిస్థితుల  నేపథ్యంలో కాటంరాజును పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. 

2:22 PM IST:

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఘన విజయం అందుకోడానికి కారణమని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయన్నారు. ప్రతిపక్ష పార్టీల కంటే టీఆర్ఎస్ రెబల్  అభ్యర్ధులే ఎక్కువ స్థానాల్లో గెలిచారన్నారు. ఈ ఫలితం ద్వారా మరోసారి ప్రజలు తమవెంటే వున్నారని నిరూపితమైందని  గంగుల పేర్కొన్నారు. 

2:12 PM IST:

తెలంగాణలో వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్  కూతురు కల్వకుంట కవిత ట్విట్టర్ వేధికన స్పందించారు.  ''మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకే కాకుండా పార్టీ గెలుపుకోసం కృషిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఒక్కరికి అభినందనలు మరియు శుభాకాంక్షలు. జై తెలంగాణ... జై టీఆర్ఎస్... జై కేసీఆర్.'' అంటూ కవిత ట్వీట్ చేశారు. 

1:44 PM IST:

సిరిసిల్లలో పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తూ తమ పట్ల అవమానకరంగా వ్యవహరించారని ఓటమిపాలైన అభ్యర్ధులు వాపోయారు. ఓటమిపాలైన అభ్యర్ధులను కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లనివ్వకుండా ఓ గదిలో పెట్టారని అన్నారు. అయితే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకూడదనే తాము ఇలా చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

1:28 PM IST:

ఉమ్మడి మెదక్ జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితం వెలువడింది. ఇక్కడ 20  వార్డులకు గాను 10 వార్డుల్లో ఇండిపెండెంట్లు, 9 వార్డుల్లో టీఆర్ఎస్, 1 చోటు బిజెపి అభ్యర్ధి విజయం సాధించారు. ఇలా ఏ పార్టీకి స్ఫష్టమైన ఆధిక్యం లభించకుండా ఇండిపెండెంట్లు ఆధిక స్థానాలు  గెలుచుకున్నారు. 
 

1:20 PM IST:

జనగామ మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  ఇక్కడ  కాంగ్రెస్, టీఆర్ఎస్ ల పార్టీలు ఛైర్మన్ పీఠం దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బిజెపి తో పొత్తుకు కాంగ్రెస్ ఆసక్తి చూపిస్తోంది. అలాగే ఇప్పటికే ఇద్దరు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్ క్యాంప్ కు తరలించినట్లు తెలుస్తోంది. ఛైర్మన్ పీఠానికి మూడు స్థానాలకు దూరంలో నిలిచిన టీఆర్ఎస్ కూడా రాజకీయ ఎత్తులకు సిద్దమైంది. 
 

1:12 PM IST:

ఖమ్మం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఇక్కడ మొత్తం 24 వార్డులకు గాను 19 స్థానాల్లో టీఆర్ఎస్, 5 వార్డుల్లో ఇండిపెండెంట్లు  గెలుపొందారు. వీరిలో కూడా అత్యధికులు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్ధులే. ఇక కాంగ్రెస్, బిజెపి పార్టీలు  ఖాతా కూడా తెరవలేదు. 

1:08 PM IST:

ప్రత్యర్థులు అందుకోలేని విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ సాధించడం చాలా ఆనందాన్నిస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ విజయం కోసం కృషిచేసిన టీఆర్ఎస్ నేతలు, కార్తకర్తలను ఆయన అభినందనలు తెలిపారు. అయితే బంగారు తెలంగాణ కేసీఆర్ తోనే సాధ్యమని నమ్ముతున్నట్లు ప్రజలు ఈ ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించారని హరీష్ అన్నారు. 
 

1:03 PM IST:

కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టీఆర్ఎస్ షాకిచ్చింది. మంథని మున్సిపాలిటీని దక్కించుకున్న టీఆర్ఎస్ ఉమ్మెల్యే ఆధిపత్యానికి గండి కొట్టింది. 

12:59 PM IST:

అమరచింత మున్సిపాలిటీలో విచిత్రమైన ఫలితం  వెలువడింది. అక్కడ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. అధికార  టీఆర్ఎస్ 3, టిడిపి  1, కాంగ్రెస్ 2, సిపిఐ 1, బిజెపి 1, ఇండిపెండెంట్ 1 వార్డులో గెలుపొందారు. 

12:42 PM IST:

జల్ పల్లిలో మున్సిపాలిటీలో పోటీ కేవలం టీఆర్ఎస్, ఎంఐఎం ల మధ్యే కొనసాగుతోంది. ఇక్కడ బిజెపి, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు కనీసం పోటీలో కూడా నిలవలేదు. 

12:41 PM IST:

యాదరిగిగుట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. స్వతంత్ర అభ్యర్ధిగా గెలుపొందిన కాటం రాజును దక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో  కౌంటింగ్ కేంద్రం వద్దే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అతడికి కలుసుకోడానికి ఒకేసారి  ఇరు పార్టీల నాయకులు రావడంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే రాజును సురక్షితంగా  కౌంటింగ్ కేంద్రంలోకి పోలీసులు తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. 
 

12:18 PM IST:

కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. మొత్తం 39 వార్డుల్లో 24 టీఆర్ఎస్, 10 ఇండిపెండెంట్, బిజెపి 3, కాంగ్రెస్ 2 గెలుచుకున్నాయి. ఇక్కడినుండి గెలుపొందిన 10 మంది ఇండిపెండెంట్లు కూడా టీఆర్ఎస్ రెబల్సే కావడం విశేషం. 

12:11 PM IST:

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్  కేంద్రంవద్ద ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.  కౌంటింగ్ కేంద్రంలోకి  నార్కట్ పల్లి  ఎంపీపీని అధికారులు అనుమతించకపోవడం ఈ ఉద్రిక్తతకు దారితీసింది.  అధికారుల తీరుపై  కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. 
 

12:03 PM IST:

సంగారెడ్డి మున్సిపాలిటీలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది. అయితే కాంగ్రెస్ నుండి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా ప్రచారంలో వున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలా జగ్గారెడ్డి గెలుపొందారు. మొత్తంగా ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్ధులు ఇప్పటివరకు గెలుపొందారు. 

11:49 AM IST:

తుక్కుగూడ మున్సిపాలిటీ ఫలితాల్లో బిజెపి హవా  కొనసాగుతోంది. ఇక్కడ టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నబిజెపి ఈ మున్సిపాలిటీని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

11:42 AM IST:

హైదరాబాద్ శివారు ప్రాంతమైన బోడుప్పల్ లో మిక్స్‌డ్ రిజల్ట్స్  వెలువడుతున్నాయి. ఇక్కడ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మేయర్ అభ్యర్ధిగా ప్రకటించిన మందా సంజీవరెడ్డిని ప్రకటించగా అతడు ఓటమి అంచుల్లో నిలిచాడు. అంతేకాకుండా 5,6 స్థానాల్లో కాంగ్రెస్  ఆధిక్యం కనబరుస్తోంది. టీఆర్ఎస్ కూడా మరో ఐదారు వార్డుల్లోనే  ఆధిక్యాన్ని కలిగివుంది. ఇప్పటివరకు ఇక్కడినుండి ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు  అధికార టీఆర్ఎస్ కు కాస్త వ్యతిరేకంగానే వున్నాయని చెప్పాలి. 
 

11:36 AM IST:

మోత్కూరులో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇక్కడ ఇప్పటివరకు ఆరు వార్డుల్లో టీఆర్ఎస్, ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. మరో వార్డులో కౌంటింగ్ కొనసాగుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. 

11:33 AM IST:

జనగాం మున్సిపాలిటీలో  కాంగ్రెస్ ముందంజలో వుంది. 

11:30 AM IST:

కొడంగల్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ముందంజలో వున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహించాడు. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా వున్న ఆయన కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున   కొడంగల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహించారు.  
 

11:20 AM IST:

 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భైంసాలో విచిత్రమైన పోరు సాగుతోంది. ఇక్కడ అధికార పార్టీ అసలు పోటీలోనే లేకుండా పోయింది. ఇక్కడ  ఎంఐఎం, బిజెపిల మధ్యే ప్రదానంగా పోటీ సాగుతోంది. ఇక్కడ బిజెపి 6, ఎంఐఎం 7 వార్డులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ పోటీలో నిలవలేదు. 

11:10 AM IST:

పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ లో టీఆర్ఎస్ పార్టీ ముందంజలో వుంది. 

11:07 AM IST:

సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. 

11:02 AM IST:

గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.  మొత్తం 10 వార్డులకు గాను కాంగ్రెస్ ఏకంగా 9 చోట్ల విజయం సాధించింది. అధికార  టీఆర్ఎస్ కేవలం ఒక్కచోట మాత్రమే గెలుపొందింది. 

10:57 AM IST:

ఐజా మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం గెలెచుకుంది. టీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో తన వర్గీయులను స్వతంత్రంగా పోటీకి దించారు జూపల్లి. ఇలా టీఆర్ఎస్ రెబల్స్ గా బరిలోకి దిగిన అభ్యర్ధులు అత్యధిక వార్డుల్లో  గెలుపొందారు. 

10:51 AM IST:

ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. మొత్తం 22 వార్డుల్లో 15 టీఆర్ఎస్,5  కాంగ్రెస్,  2 బిజెపి గెలుచుకుంది.

10:49 AM IST:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఇక్కడ నాలుగు మున్సిపాలిటీల్లో ఇప్పటికే టీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. 

10:45 AM IST:

యాదిగిరిగుట్ట మున్సిపాలిటీలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి.  ఇక్కడ మొత్తం 12 వార్డుల్లో కాంగ్రెస్ 9,  టీఆర్ఎస్ 3 వార్డులను మాత్రమే గెలుచుకోగలిగింది. 

11:04 AM IST:

సంగారెడ్డి  జిల్లా అందోల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించంది. టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 6 ఇతరులు 1 స్థానాలో గెలుపొందారు.

10:36 AM IST:

అమన్ గల్ మున్సిపాలిటీ ఆరు వార్డుల్లో బిజెపి పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 

10:33 AM IST:

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది.  మొత్తం  17 వార్డులకు గాను కాంగ్రెస్ 8, టీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపొందాయి. 

10:29 AM IST:

కొల్హాపూర్ మున్సిపాలిటీలోని ఇరు వార్డుల్లో టీఆర్ఎస్ రెబల్స్ ఇరుచోట్ల గెలుపొందారు. దీంతో గెలుపొందిన అభ్యర్ధులు చేజారకుండా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వారిని క్యాంపుకు తరలిస్తున్నట్లు సమాచారం. 

10:25 AM IST:

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.    మొత్తం 12 వార్డులకు గాను 11 టిఆర్ఎస్, కేవలం 1 కాంగ్రెస్ గెలుపొందింది. 

10:21 AM IST:

హైదరాబాద్ శివారులోని మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.  అలాగే మీర్ పేట్ కార్పోరేషన్ ను కూడా టీఆర్ఎస్ గెలుచుకుంది.  

10:17 AM IST:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్ గల్, బాన్సువాడ, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది.

10:14 AM IST:

వరంగల్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 15 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.  

10:11 AM IST:

ధర్మపురి మన్సిపల్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠకు దారితీశాయి. చివరివరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరాడాయి. అయితే కేవలం ఒకే ఒక్క వార్డు తేడాతో టీఆర్ఎస్ పార్టీ  మున్సిపాలిటీని కైవసం చేసుకుంది.  8 వార్డుల్లో టీఆర్ఎస్, 7 స్ధానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. 

10:07 AM IST:

సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీని అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 22 వార్డుల్లో టీఆర్ఎస్ 13 వార్డుల్లో గెలుపొందింది.

10:04 AM IST:

దేవరకొండ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. 10వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయకేతనం ఎగరేశాడు. 

9:58 AM IST:

పెద్దపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది.మొత్తం వార్డుల్లో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1, బిజెపి 1 దక్కించుకున్నాయి. 

9:55 AM IST:

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించాడు. 

9:53 AM IST:

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా స్పష్టంగా  కనిపిస్తోంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను అధికారపార్టీ కైవసం చేసుకోగా సూర్యాపేట, మహబూబ్ నగర్ మున్సిపాలిటీల్లో కూడా ముందంజలో ఉంది. 

9:50 AM IST:

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెలిచింది. వర్ధన్నపేటలోని 12 వార్డుల్లో టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 2, బిజెపి 1, స్వతంత్రులు 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.