కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, సురేశ్ రెడ్డి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఐటీ, నైపుణ్యాభివృద్దికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేసిన తెలంగాణ మంత్రి ఈ భేటీ సహృదయపూర్వకమైన వాతావరణంలో సాగిందన్నారు. అభివృద్ధి చెందుతున్న భారతీయ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలో ఉన్న అవకాశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన ఎకోసిస్టమ్ను సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్వీట్ చేశారు.
