తెలంగాణలో కేవలం మూడు చోట్ల మాత్రమే విమానాశ్రాయల నిర్మాణానికి అనుకూలంగా వుందని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. 

తెలంగాణా నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్టుల టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ తుది రిపోర్టులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. మొత్తం ఆరింటిలో మూడు మాత్రమే పూర్తిస్థాయి ఎయిర్‌పోర్టుల నిర్మాణం, పెద్ద విమానాల రాకపోకలకు అనుకూలమని, మరో మూడు అందుకు అనుకూలంగా లేవని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తేల్చింది. తెలంగాణాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది.

మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాలుగా తగిన విధంగా ఉన్నాయని ఏఏఐ తన నివేదికలో పేర్కొంది. వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు వరంగల్‌లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని జక్రాన్ పల్లిలు మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి. అటు భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్లు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థ ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. 

అయితే పెద్ద విమానాలు నడిపే ఫీజిబిలిటీ లేనిచోట్ల లోకల్‌గా చిన్న విమానాలు నడుపుకునేందుకు అనుమతివ్వాలని తెలంగాణా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి ఒక లేఖ రాసింది. చిన్న విమానాలను నడిపే అంశంపై చర్చించడానికి భాగస్వాములతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. అవసరమైతే మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని తెలంగాణ సర్కార్ లేఖలో పేర్కొంది.