Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ విమోచన వేడుకలను ప్రారంభించిన అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులు

కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. 
 

telangana liberation day Amit shah hoisted the national flag at Secunderabad Parade Grounds
Author
First Published Sep 17, 2022, 9:18 AM IST

తెలంగాణ విమోచన వేడుకలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన వేడుకలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. జాతీయ జెండాను ఎగరవేశారు. భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండ్.. తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios