షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు.. ఇంటర్ బోర్డ్
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
హాల్ టికెట్లు కూడా ఇచ్చామని, జంబ్లింగ్ కూడా అయిపోయిందన్నారు. మే 2 నుంచి ఇంటర్ ఫస్టియర్, మే 2 నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కరోనాతో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, పరీక్సలు రద్దు చేసే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జలీల్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1771 సెంటర్లు ఉన్నాయని, అదనంగా 400 సెంటర్ల ఏర్పాటు చేశామని తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి 8.50 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని జలీల్ తెలిపారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి... పోలీసులకు డిజిపి కీలక ఆదేశాలు...
ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి నివారణపై రాష్ట్రంలోని అన్నిపోలీస్ కమీషనర్లు, ఎస్పిలు, పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు డీజీపీ మహేందర్ రెడ్డి.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైసేషన్ తదితర కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని డీజీపీ ఆదేశించారు. కోవిడ్ రెండవ విడత రాష్ట్రంలో తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నందున దీని నివారణకు మరోసారి పెద్ద ఎత్తున అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.
స్థానిక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహాయ సహాకారాలతో కోవిడ్ నివారణ చర్యలు, వాక్సినేషన్ వేసుకోవడం, మాస్క్ లను ధరించడం తదితర నివారణ చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని డిజిపి ఆదేశించారు.