ట్రాఫిక్ హోంగార్డు ఆఫ్రఫ్ అలీని హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ఇవాళ సన్మానించారు. ప్రతి రోజూ హైకోర్టుకు వెళ్లే సీజే అష్రఫ్ అలీ  విధుల పట్ల చూపే నిబద్దతను పరిశీలించేవారు. 

హైదరాబాద్: నిబద్దతతో విధులు నిర్వహిస్తున్న హోంగార్డును తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శుక్రవారం నాడు ఘనంగా సన్మనించారు. ప్రతి రోజూ హైకోర్టుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న హోంగార్డు అష్రఫ్ అలీ పనితీరును చీఫ్ జస్టిస్ గమనించేవారు. విధుల పట్ల అష్రఫ్ తీరును చీఫ్ జస్టిస్ సతీష చంద్ర శర్మ గమనించేవారు. ఆష్రఫ్ అలీ తన విధుల పట్ల నిబద్దతను గమనించిన చీఫ్ జస్టిస్ 

ఆబిడ్స్ లో కాన్వాయ్ ను ఆపి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించిన సీజే, ఒక్కసారిగా కారు ఆపి సన్మానించడంతో అవాక్కైన హోంగార్డు అష్రఫ్ అలీ.. హైకోర్టుకు వెళ్లే మార్గంలో హోంగార్డు పనితీరును మెచ్చుకున్న సీజే విధుల పట్ల హోంగార్డు తీరును చీఫ్ జస్టిస్ మెచ్చుకున్నారు. శుక్రవారం నాడు ఉదయం హైకోర్టుకు వెళ్లే సమయంలో ఆబిడ్స్ లోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద విధులు నిర్వహిస్తున్న ఆష్రఫ్ అలీకి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు.