వరంగల్ సీపీ తరుణ్ జోషిపై బదిలీ వేటు.. కొత్త కమీషనర్గా ఏవీ రంగనాథ్
వరంగల్ పోలీస్ కమీషనర్ తరుణ్ జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్ని నియమించింది. అయితే ఈ ఆకస్మిక బదిలీకి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.
వరంగల్ పోలీస్ కమీషనర్పై తెలంగాణ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం సీపీగా వున్న తరుణ్ జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ఏవీ రంగనాథ్ని నియమించింది. తరుణ్ జోషిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆకస్మిక బదిలీకి దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.