Asianet News TeluguAsianet News Telugu

నీటి పారుదలశాఖలో ప్రక్షాళన : ఈఎన్సీ రాజీనామాకు రేవంత్ సర్కార్ ఆదేశం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఇన్‌ఛార్జ్ తొలగింపు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌ నిర్మాణంలో డొల్లతనం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. 

telangana govt serious action on irrigation department ksp
Author
First Published Feb 7, 2024, 8:42 PM IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌ నిర్మాణంలో డొల్లతనం, అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి పారుదల శాఖలో భారీ ప్రక్షాళనకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. అలాగే రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్‌ఛార్జ్ వెంకటేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios