టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . సంస్థ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏను మంజూరు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . సంస్థ ఉద్యోగులకు 4.8 శాతంతో మరో డీఏను మంజూరు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అక్టోబర్ నెల వేతనంతో కలిసి డీఏ చెల్లిస్తామని ఆర్టీసీ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు పెండింగ్లో వున్న మొత్తం 9 డీఏలు మంజూరు చేసినట్లు టీఎస్ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.