వర్షం ఎఫెక్ట్: తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా
హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
హైదరాబాద్: హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో దసరా వరకు అన్ని రకాల పరీక్షలను వాయిదా వేసినట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
also read:హైద్రాబాద్లో వరదలు: గతంలో ముంచెత్తిన ముప్పులు ఇవీ...
దీంతో రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల పరిధిల్లోని విద్యాసంస్థల్లో జరుగుతున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.దసరా పర్వదినం వరకు ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.