తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చొరవతో నూతన ఇంటిగ్రేటేడ్ ఆసుపత్రి ఫెసిలిటీ మేనే్జ్మెంట్ సర్వీసెస్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించింది.
హైదరాబాద్: తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao చొరవతో నూతన ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్" (IHFMS) పాలసీని ప్రభుత్వం ఆవిష్కరించింది.
Sanitary W orkersకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి KCR నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బెడ్ ఒక్కంటికి నెలకు చేసే పారిశుద్ద్య ఖర్చును 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని Nursing college, నర్సింగ్ స్కూళ్లకు వర్తింపజేస్తు తాజాగా G.O 31 ను విడుదల చేసింది. గత ఏడాది నమోదైన బెడ్ ఆక్యుపెన్సీ లేదా మంజూరైన పడకల సంఖ్యలో 50 శాతాన్ని వీటిలో ఏది ఎక్కువ అయితే దాని ఆధారంగా రికనబుల్ బెడ్ స్ట్రెంత్ (RBS) ను నిర్ణయించనుంది.
ప్రస్తుతం ప్రతి 7000 స్క్వేర్ ఫీట్ల బిల్డప్ ఏరియాకు ఒకరిని, ఓపెన్ ఏరియా అయితే 27,000 స్క్వేర్ ఫీట్ కు ఒకరిని నియమించే విధానం అమల్లో ఉంది. మెడికల్ కాలేజీలకు వర్తించే ఈ విధానాన్ని., నర్సింగ్ కాలేజీలకు,
నర్సింగ్ పాఠశాలలకు (హాస్టల్స్తో సహా) కూడా విస్తరించింది. 200 ఆపై పడకల్ ఉన్న దవాఖానకు ప్రత్యేకంగా టెండర్లు పిలువనున్నారు. 200 లోపు పడకలు ఉన్న ఆసుపత్రులకు వీలైనంత వరకు కలిపి టెండర్లు పిలువాలని ప్రభుత్వం సూచించింది. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ టెండర్లను జిల్లా స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా ఆరోగ్య సంఘం IHFMS ఏజెన్సీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. పారిశుద్ధ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలను పాటించేలా కార్మికులకు నైపుణ్యం పెంపుదలలో ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సహయం చేస్తాయి.
ఆసుపత్రుల్లో పౌష్టికాహారం అందించే ఏజెన్సీల్లో రిజర్వేషన్లు
SCలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తుంది ప్రభుత్వం. తాజాగా ఆసుపత్రుల్లో పోషకాహారం అందించే ఏజెన్సీలకు దీనిని వర్తింపజేసింది. ఈ మేరకు ఇవాళ G.O 32 ను విడుదల చేసింది. 16 శాతంఏజెన్సీలను ఎస్సీలకు కేటాయించాలని ఆదేశించింది.
గరిష్ఠంగా 500 పడకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానాలకు రిజర్వేషన్ వర్తింపజేసింది. ఇందుకోసం హాస్పిటళ్లను రెండు కేటగిరీలుగా విభజించింది. 100 వరకు Beds ఉన్న హాస్పిటల్ లను ఏ కేటగిరి గా, 500 వరకు బెడ్లు ఉన్న హాస్పిటల్ లను బి కేటగిరిగా నిర్ధారించింది.
ఏ హాస్పిటల్లో రిజర్వేషన్ కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారించనున్నారు. కనీస టర్నోవర్ ను 50% తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. రిజర్వుడ్ హాస్పిటల్ కు ఒక్క బిడ్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఒక్కటి రాకపోతే మరోసారి Tenderఆహ్వానించాలి. అప్పుడు కూడా బిడ్లు రాకపోతే ఓపెన్ టెండర్లు పిలువాలలని ప్రభుత్వం ఆదేశించింది.
