Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల రక్షణపై కమిటీ ... తొలి భేటికి హాజరైన సబిత

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత, రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ తొలి భేటీకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. 

telangana government constitutes committee for framing children safety, security guidelines in govt and aided schools
Author
First Published Nov 26, 2022, 5:24 PM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో విద్యార్ధుల భద్రత, రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించేందుకు కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, అడిషనల్ డీజీ స్వాతి లక్రాను నియమించారు. ఈ కమిటీ తొలి సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios