లాక్డౌన్: తెలంగాణలో ఈ-కామర్స్, పుడ్డెలివరీ యథాతథం
తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సేవలకు యధాతథంగా కొనసాగుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ కామర్స్ సేవలకు యధాతథంగా కొనసాగుతాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలో లాక్డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ తరుణంలో పుడ్ డెలివరీతో పాటు ఈ కామర్స్ సేవలు యధాతథంగా కొనసాగతాయని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. శనివారం నాడు పలు ఈ కామర్స్ సిబ్బంది వాహనాలను సీజ్ చేశారు. అంతేకాదు ఉదయం 10 గంటల తర్వాత ఈ కామర్స్ సేవలకు ఆటంకం కల్గించారు.
alsoread :ఈ పాస్ ఉంటేనే తెలంగాణలోకి వాహనాల అనుమతి: తెలంగాణ- ఏపీ సరిహద్దుల్లో ఆంక్షలు
ఈ విషయమై ఈ కామర్స్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ విషయాన్ని పరిశీలించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హైద్రాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలతో ఈ విషయమై మాట్లాడారు. ఈ కామర్స్ సంస్థల ప్రతినిధులతో పాటు పుడ్ డెలివరీ కి ఎలాంటి ఇబ్బందులు లేవని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం నాడు స్పష్టం చేశారు.