Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ తిట్లకు తిట్లతోనే జవాబంటున్న కాంగ్రెస్

కెసిఆర్ ఫ్యామిలి బందిపోట్ల ముఠా: తెలంగాణా కాంగ్రెస్

Telangana congress replies KCR in  same filthy language

తిట్టుకి తిట్టే సమాధానమని తెలంగాణా కాంగ్రెస్ నాయకులంటున్నారు. కెసిఆర్ ఏ భాష మాట్లాడితే అదే భాషలో నే సమాధానం,  ఇక మర్యాదకుతావులేదని వారు తీర్మానించారు. ఈ రోజు,  నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ మీద చేసిన దాడికి అంతే పరుష పదజాలం ప్రయోగించి  వారు సమాధానం చెప్పారు.

 

ఆంధ్రోళ్లకు సంచులు మోసిననోళ్లు, సన్నాసులని ముఖ్యమంత్రికెసిఆర్ కాంగ్రెసోళ్లని  విమర్శింని సంగతి తెలిసిందే.  తెలంగాణా కాంగ్రెస్ నాయకులు  ఈ విమర్శను తిప్పికొట్టారు.

 

అసలు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి సంచులు తీసుకుంటున్నదే కెసిఆర్ అని చెబుతూ  ఆ మధ్య ఒక ఆంధ్రా కాంట్రాక్టర్ కు కెసిఆర్ సన్మానం చేయడాన్ని వారు ఉదహరణగా చూపించారు. ఏ కాంట్రాక్టర్ నుంచి కెసిఆర్ కు ఎన్ని సంచులందుతున్నాయో అందరికీ తెలుసని వారు పేర్కొన్నారు.

 

ఇలా సంచులతో తీసుకున్న డబ్బుతో  గత 30 నెలల్లో  ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనడం తప్ప కెసిఆర్ ముఖ్యమంత్రిగా చేసిందేమిటని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి హనుమంతరావు, డాక్టర్ మల్లురవి తదితరులు ప్రశ్నించారు.

 

‘సెక్యులర్ దేశంలో కోట్ల రుపాయలప్రజాధనం తో  సొంత మొక్కులు  తీర్చుకోవడానికి సిగ్గపడాలి. ఇకనుండి కేసీఆర్ ఏ భాషలో  మాట్లాడితే .. మేము ఆ భాషలోనే సమాధానం చెబుతాం. ఆంధ్ర కాంట్రాక్టర్ నుండి సూట్ కేసులు తీసుకుంటున్నది కేసీఆరే,‘  పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

 

కేసీఆర్ ఫ్యామిలి బందిపోట్ల ముఠా అని వర్ణించారు.

 

‘ఒక్క కోదండరామ్ ను చూసే వణికిపోతున్నవ్,ఇంకా కాంగ్రెస్ కూడ  రోడ్డెక్కితే,నీ పని అంతే,’ అని హనుమంతరావు అన్నారు. టీఆరెస్ లో తొందర్లో  సునామి రాబోతుందని ఆయన హెచ్చరించారు.

 

షబ్బిర్ ఆలీ మాట్లాడుతూ కామన్ గుడ్ ఫండ్  సొంతమొక్కులకు ఖర్చు చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు.  కెసిఆర్ చరిత్ర అంతా దగా లే అంటూ దళితుడిని  సీఎం చేస్తానని ఓట్లకోసం మాట్లాడి తర్వాత దగా చేశాడని, ఇలాగే అన్ని వర్గాలను దగా చేసిన ఘనత ఆయనదని షబ్బీర్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేయడమే కేసీఆర్ కు అలవాటు ఆయనొక చీట్ అని మండిపడ్డారు.



.

Follow Us:
Download App:
  • android
  • ios