Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై ద్విముఖ వ్యూహం: కేసీఆర్

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Telangana CM KCR reviews on Corona cases lns
Author
Hyderabad, First Published May 24, 2021, 9:07 PM IST

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షలను మరింతగా పెంచుతూ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ కరోనాను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను కోరారు.  కరోనా పరీక్షలకు సంబంధించి రాపిడ్ యాంటీ జెన్ టెస్టు కిట్ల సంఖ్యను తక్షణమే పెంచాలన్నారు. అవసరమున్న మేరకు ఉత్పత్తిదారులతో మాట్లాడి సరఫరాను పెంచాలని  ఆయన సూచించారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో చికిత్స కోసం రాష్ట్రంలో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు, మందులను తక్షణమే సమకూర్చుకోవాలని సీఎం సూచించారు.

also read:కరోనా వ్యాక్సినేషన్: సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష

 రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుంద‌న్నారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా, వారి ఆరోగ్య రక్షణలో భాగంగా లాక్‌డౌన్ కఠినంగానే అమలువుతున్నద‌న్నారు. కరోనా పరీక్షలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తక్షణమే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ల సంఖ్యను 50 లక్షలకు పెంచాలని సీఎం ఆదేశించారు. అదే సమయంలో వైద్య కేంద్రాల్లో కావాల్సిన మేరకు సిబ్బందిని నియమించుకోవాలని కలెక్టర్లకు, వైద్యాధికారులను ఆదేశించారు. ఇప్పటికే అధికారాలిచ్చిన నేపథ్యంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన ఆధికారులను ఆదేశించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవాలని ఎంతటి ఖర్చుకైనా వెనకాడవద్దన్నారు.

 ఆసుపత్రుల్లోని అన్ని పడకలను ఆక్సిజ‌న్ పడకలుగా మార్చాలని, రాష్ట్రంలో ఆక్సిజ‌న్ ఉత్పత్తిని 600 ఎంటీలకు పెంచే విధంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు.  అదే సందర్భంలో సెకండ్ డోస్ వేయించుకోవాల్సిన వారు అధిక‌ సంఖ్యలో ఎదురు చూస్తున్నందున వారికి సరిపోను వాక్సిన్లను తక్షణమే సరఫరా చేయాల్సిందిగా సంబంధిత వాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. థర్డ్ వేవ్ ఒక‌వేళ వస్తే ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాల‌న్నారు.ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌తో పాటు ఇంకా ఏ ఏ రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నవి. అందుకు వారు అమలు పరుస్తున్న కార్యాచరణ ఏంటో తెలుసుకోవాల్సిందిగా వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. 

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ దాని శాతం 5 శాతానికి తగ్గించగలిగినప్పుడే మనం కరోనా మీద విజయం సాధించినవారమౌతామన్నారు.ఆ దిశగా వైద్యాధికారులు చర్యలను చేపట్టాలని సీఎం కోరారు.బ్లాక్ ఫంగస్ వ్యాధిని కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన కార్యాచరణ గురించి చర్చించారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం గాంధీలో 150 బెడ్లు, ఈ.ఎన్.టి. ఆస్పత్రిలో 250 బెడ్లను, మొత్తం 400 బెడ్లను కేటాయించినట్లుగా వైద్యాధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం సరోజినీదేవి ఆస్పత్రిలో 200 బెడ్లు, గాంధీ ఆస్పత్రిలో 160 బెడ్లను బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్స కోసం తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.ఇంకా ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంఖ్యను 1500 కు పెంచాలన్నారు. బ్లాక్‌ ఫంగస్ చికిత్సకు మందులను తక్షణమే ఆర్డరివ్వాలన్నారు. బ్లాక్ ఫంగస్ కట్టడి కోసం కావాల్సిన డాక్టర్లను యుద్దప్రాతిపదికన నియమించుకోవాలన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios