Asianet News TeluguAsianet News Telugu

30 లక్షల మంది తెలంగాణకొచ్చి బతుకుతున్నారు .. అభివృద్ధిని కొనసాగించాలి : కేసీఆర్

తెలంగాణకు 30 లక్షల మంది వలస వచ్చి బతుకుతున్నారని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి కృషితోనే సామాజికాభివృద్ధి సాధ్యమన్నారు సీఎం. 

telangana cm kcr review meeting on development issues
Author
First Published Nov 27, 2022, 6:20 PM IST

ప్రభుత్వ యంత్రాంగం సమిష్టి కృషితోనే సామాజికాభివృద్ధి సాధ్యమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియలా కొనసాగించాలని సూచించారు. మౌలిక వసతులు మరింత మెరుగుపరచాలని , ప్రజల సౌకర్యం కోసం అన్ని రంగాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. తెలంగాణకి 30 లక్షల మంది వలస వచ్చి బతుకుతున్నారన్న కేసీఆర్.. రాష్ట్రంలో రాబడి పెరిగి ఆర్ధిక వనరులు కూడా పెరిగాయన్నారు. 

ఇకపోతే... డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, దానిని ఢీకొట్టేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాం ఖరారు చేశారు. అనవసర ఆంక్షల కారణంగా రాష్ట్రానికి కలిగే నష్టాలపై కేంద్రంలోని అధికార బీజేపీని నిలదీయాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో మోడీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక విధానాలు, రాష్ట్రాల భవిష్యత్తు, అభివృద్ధికి అవరోధంగా మారాయని చెప్పేందుకు సిద్ధమయ్యారు. 

ALso REad:డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీని ఢీకొట్టేందుకు వ్యూహం ఖరారు చేసిన సీఎం కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో రాష్ట్ర ఖజానాకు రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) గురువారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆ ప్రకటనలో ప్రభుత్వం తెలిపిందని ‘డెక్కన్ క్రానికల్’నివేదించింది.

సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేస్తున్న బడ్జెట్ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాలు తమ బడ్జెట్ ను రూపొందిస్తాయి. ఆనవాయితీ ప్రకారం.. ఆర్థిక వనరులను సమీకరించడానికి ప్రతీ రాష్ట్రానికి కేంద్రం ఎఫ్ఆర్ బీఎం పరిమితిని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.54,000 కోట్ల ఎఫ్ఆర్ బీఎం పరిమితిని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులను సిద్ధం చేసింది. కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని రూ.39,000 కోట్లకు తగ్గించింది. ఫలితంగా తెలంగాణ రావాల్సిన రూ.15,000 కోట్లు తగ్గిపోయాయి.

ALso Read:తెలంగాణ ప్రజల పల్స్ నాకు తెలుసు.. అక్కడ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్ షా

దీనికితోడు రాష్ట్రానికి బడ్జెటేతర నిధుల రూపంలో వచ్చే రూ.20,000 కోట్ల విడుదలను కేంద్రం నిలిపివేసింది. అయితే దీనిపై సీఎంఓ తన ప్రకటనలో స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక దుర్వినియోగంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణకు దాదాపు రూ.40,000 కోట్లు రాలేదని తెలిపింది. రాజకీయ ప్రేరేపిత, ప్రతీకార క్షీణత విధానాలతో రాష్ట్రాల గొంతులను అణచివేసి, రాష్ట్రాలకు హాని కలిగించడం ద్వారా కేంద్రం సమాఖ్య విధానాన్ని బలహీనపరుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. కేంద్రం అనుసరిస్తున్న ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలను, అంశాలను రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios