కాంపా నిధుల్లో నయా పైసా కూడా కేంద్రానిది లేదు.. మొత్తం మన డబ్బే: అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన
కాంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 100 శాతం అది రాష్ట్రాల డబ్బులు మాత్రమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
కాంపా నిధులు కేంద్ర ప్రభుత్వానివి కావన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 100 శాతం అది రాష్ట్రాల డబ్బులు మాత్రమే అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
నీటి ప్రాజెక్టులు, రోడ్లకు, లేదా ఇతర అవసరాల కోసం అటవీ భూములను కొనుగోలు చేస్తామన్నారు. అడ్వాన్స్ కింద రాష్ట్రాలు కేంద్రానికి డబ్బులు చెల్లించాలని కేసీఆర్ తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్రం వద్ద జమ చేసిన డబ్బు రూ. 4675 కోట్లు అని చెప్పారు. ఇవి మనం కట్టిన డబ్బులేనని.. కేంద్రానిది నయా పైసా కూడా లేదన్నారు. అయితే మోదీని కలిసి కాంపా నిధులు విడుదల చేయాలని కోరామని.. మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత విడుదల చేశారని కేసీఆర్ తెలిపారు. అయితే మనకు ఇచ్చే నిధుల్లో 10 శాతం కేంద్రం కట్ చేస్తుందని చెప్పారు.
కాంపా నిధుల్లో భాగంగా రాష్ట్రానికి రూ. 3,109 కోట్లు నిధులు విడుదల చేశారని.. ఇందులో రూ. 1320 కోట్లు ఖర్చు పెట్టామని.. నరేగా కింద రూ. 3673 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. హెచ్ఎండీఏ ద్వారా రూ. 367 కోట్లు, జీహెచ్ఎంసీ ద్వారా రూ. 83 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. నర్సీరల పెంపకం, ఏర్పాటు, కూలీలు, మొక్కల సరఫరా, నీటి రవాణాకు ఖర్చు చేశామని.. నిధుల దుర్వినియోగం జరగడం లేదని సీఎం పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం రూ. 6,555 కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్ సభకు తెలిపారు.
తెలంగాణలో పంచాయతీరాజ్ కింద 67,276 కి.మీ. ఆర్ అండ్ బీ కింద 28,080 కి.మీ. నేషనల్ హైవేస్ కింద 4 వేల కి.మీ. ఉన్నాయి. అన్నీ కలిపితే 1,00,156 కి.మీ. మేర రోడ్ లెంత్ ఉంది. ఇందులో 82491 కి.మీ. మేర ప్లాంటేషన్ చేశారన్నారు. పంచాయతీరాజ్ కింద 59 వేల కిలోమీటర్లు కవర్ చేశారని... ఆర్ అండ్ బీ వారు 8652 కి.మీ. మేర మొక్కలు నాటారని తెలిపారు. ఫారెస్టు డిపార్ట్మెంట్ అధికారులు.. జాతీయ రహదారులపై మొక్కలు నాటి, వారి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు అని సీఎం కేసీఆర్ ప్రశంసించారు.