సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా కానుక
సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దసరాలోపు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకం చెల్లించాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అర్హులైన కార్మికుల కోసం రూ.368 కోట్లు చెల్లించనుంది సింగరేణి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.