హుజురాబాద్ నియోజకవర్గంలో (huzurabad bypoll) ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాతంగా ముగిసిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner) శశాంక్ గోయల్. ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చారని అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేశాయని శశాంక్ గోయల్ వెల్లడించారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో (huzurabad bypoll) ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాతంగా ముగిసిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner) శశాంక్ గోయల్ (shashank goel ias) . హైదరాబాద్లోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు సీజ్ చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లోని డిగ్రీ కళాశాలలో (karimnagar degree college) స్ట్రాంగ్ రూమ్ (strong room) ఏర్పాటు చేశామని.. ఇక్కడ రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో భద్రత ఉంటుందని శశాంక్ చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో (2018 telangana elections) పోలిస్తే ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, బయటి వ్యక్తులు పోలింగ్ కేంద్రాలకు వద్దకు వచ్చారని అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేశాయని శశాంక్ గోయల్ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందాయని.. వీటిపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని ఆయన చెప్పారు. అలాగే కొన్ని ఫిర్యాదులపై కేసులు సైతం నమోదు చేశామని శశాంక్ గోయల్ వెల్లడించారు. హుజురాబాద్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.3.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని.. క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించామని శాంక్ గోయల్ వెల్లడించారు.
ALso Read:Huzurabad Exit Polls: హుజురాబాద్ ఎగ్జిట్ పోల్స్.. ఈటల కంచుకోటను కాపాడుకున్నట్టేనా..?
మరోవైపు పోలింగ్ వేళ ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను బెదిరిస్తున్నారంటూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్పై టీఆర్ఎస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ కాసేపటికే ఈటల కాన్వాయ్లోని మూడు వాహనాలను పోలీసులు సీజ్ చేయడం సంచలనం రేపింది. రెండు పార్టీల నేతలు పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో చాలా చోట్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. అలాగే జమ్మికుంటలో (jammikunta) ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ (aroori ramesh) పీఏలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ వారిని స్థానికులు చితకబాదారు.
కాగా, టీఆర్ఎస్లో కీలకనేతగా వున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ (etela rajender) భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ (trs) పార్టీ సభ్యత్వానికి , మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈటల రాజేందర్ రాజీనామాతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో బీజేపీ తరపు నుంచి ఈటల, కాంగ్రెస్ నుంచి వెంకట్ బల్మూరి (venkat balmoor) , టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్లు (srinivas yadav) బరిలో నిలిచారు
