Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: ముగిసిన గవర్నర్ ప్రసంగం...ఆదివారానికి సభ వాయిదా

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నేటితో ప్రారంభం కానున్నారు. ఇవాళ ఉదయం 11గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

telangana budget sessions live updates
Author
Hyderabad, First Published Mar 6, 2020, 10:43 AM IST

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇవాళ(శుక్రవారం) గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాధించిన పురోగతిని వివరిస్తూ ఈ ప్రసంగం సాగింది. గవర్నర్ ప్రసంగం ముగింపుతో సభ ఆదివారానికి వాయిదా పడింది. ఆదివారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 

రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దీన్ని ఇప్పటికే అనేక రాష్ట్రాల అమలు చేస్తున్నాయని తెలిపారు. రైతు భీమా పథకం కూడా వ్యవసాయ రంగంపై ఆదారపడే రైతన్నలకు భరోసా ఇచ్చిందన్నారు.  

కొన్ని నెలలుగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని... ఈ ప్రభావం తెలంగాణపై కూడా వుందన్నారు.  కానీ సమర్థవంతమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణతో ఈ పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. 

అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణంలో వున్న దీన్న అతి త్వరలో ప్రారంభించనున్నామని వెల్లడించారు. మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. షీ టీమ్ లు హైదరాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల మహిళా రక్షణకోసం సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. 

 గొల్ల కురుమలకు 75శాతం సబ్సిడితో గొర్రెల పంపిణీ  చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులు, గీతకార్మికుల కుటుంబాలకు రూ. 6 లక్షల ఇక్స్ గ్రేషియా అందిస్తున్నామన్నారు.  

హైదరాబాద్ లో ఏర్పాట్లుచేసిన బస్తీ దవాఖానాలు నగర పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ బస్తీ దవాఖానాల సంఖ్యను మరింత పెంచడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేదలు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయన్నట్లు వెల్లడించారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 

కళ్యాణ్‌లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి స్కీమ్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రాణాలు ఆర్పించిన  కుటుంబాలు రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించినట్టుగా తమిళిసై చెప్పారు.

బిసీ వర్గాలకు కార్యాలయాల కోసం హైదరాబాద్ కు స్థలాలు  కేటాయించామని తెలిపారు.  డ్రైవర్లు,హోంగార్డులు, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. 

తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అన్నపరిస్థితులు వుంటే దాన్ని పూర్తిగా మార్చివేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వ చర్యలతో ఇప్పుడు యావత్ తెలంగాణ సుభిక్షంగా మారుతోందన్నారు. 

వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తమిళిసై చెప్పారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టు గవర్నర్ చెప్పారు. 

ఎస్సి, ఎస్టీలకు 101 యూనిట్ల విద్యుత్ ఉచితంగా  అందిస్తున్నామన్నారు. అలాగే తమ ప్రభుత్వం విద్యుత్ కు సంబంధించి గిరిజనులపై పెట్టిన విజిలెన్స్ కేసులను కూడా ఉపసంహరించుకున్న గవర్నర్ వెల్లడించారు. 

రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. ఆయనకు రాష్ట్ర  పరిస్థితులు పూర్తిగా అవగాహన వున్నాయి కాబట్టి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందుతోందని అన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు వివక్షకు గురయ్యాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలన్నింటిని అధిగమించి తమ సాంప్రదాయాలకు పెద్దపీట వేయబడ్డాయి. పేదల సంకేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. 

అతి తక్కువ కాలంలోనే తెలంగాణ అద్భుతమైన  పురోగతిని సాధించింది. కనీస పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థాయినుండి భారీగా వాటిని పెంచుకుని  ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా సంక్షేమాన్ని అందించే స్థాయికి చేరుకుందని గవర్నర్ తెలిపారు. 

అతి తక్కువ కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దార్శనికతతో  అభివృద్ది వైపు దూసుకుపోతోంది.  ఆయన రాష్ట్రాన్ని ఎంతో ముందుచూపుతో అభివృద్ది వైపు నడిపిస్తున్నారని అని  అన్నారు.

బడ్జెట్ ప్రసంగాని గవర్నర్ తమిళసై ప్రారంభించారు. అందరికి నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగాన్ని ఇంగ్లీష్ లో కొనసాగిస్తున్నారు. 

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడానికి తమిళసై అసెంబ్లీకి చేరుకున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ తో పాటు మంత్రులు స్వాగతం పలికారు. 

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ(శుక్రవారం) అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 11గంటలకు అసెంబ్లీ కొలువుతీరనుంది. తొలిరోజు సభ ప్రారంభంకాగానే గవర్నర్ తమిళిసై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ ను కలిసి ప్రసంగ ప్రతిని అదించారు. ఈ ప్రసంగం అనంతరం సభ ఆదివారానికి వాయిదా పడనుంది. 

ఆదివారం అసలు ఘట్టం మొదలవనుంది. ఆర్థిక మంత్రి హరీష్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం నేరుగా గన్ పార్క్ కు చేరుకుని అక్కడ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి చేరుకోవాలని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. 

ఇక  గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఏసీ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చించాలన్న దానిపై సభ్యులు చర్చించనున్నారు. అసెంబ్లీని 12 రోజులు, మండలిని 5  రోజులు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వి

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హరీష్ రావు మొదటిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఇక శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

  

Follow Us:
Download App:
  • android
  • ios