తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు గురువారం ప్రవేశ పెట్టారు. 

తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2021-22 వార్షిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు గురువారం ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 1,69 ,383.44 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77కోట్లు, రెవెన్యూ మిగులు. రూ. 6 ,743.50కోట్లు. ఆర్థిక లోటు రూ. 45,509.60కోట్లుగా ఉంది. 

గత బడ్జెట్ కంటె 48వేల కోట్ల అధిక అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఇక పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,271 కోట్లు, రైతు బంధు కోసం రూ. 14,800 కోట్లు, రైతు రుణమాఫీ కోసం రూ. 5,225 కోట్లు, వ్యవసాయానికి రూ.25 వేల కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ. 1730 కోట్లు కేటాయింపులు జరిపారు. సాగునీటి రంగానికి రూ. 16,931 కోట్లు, సమగ్ర భూ సర్వే కోసం రూ. 400 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లను సర్కార్ కేటాయించింది.