Asianet News TeluguAsianet News Telugu

గిరిజనులపై చేయ్యేస్తే.. బిడ్డా: టీఆర్ఎస్ నేతలకు సంజయ్ వార్నింగ్

గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో గిరిజన భూములను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

telangana bjp president bandi sanjay warns trs leader ksp
Author
Gurrampode, First Published Feb 7, 2021, 7:05 PM IST

గిరిజనులను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం నల్గొండ జిల్లా గుర్రంపోడులో గిరిజన భూములను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

గిరిజనులు ఆనాదిగా వన్యమృగాలతో పోరాడారని అయితే ఇప్పుడు కూడా గుంట నక్కలు, గద్దలు వచ్చాయని కాకపోతే మనుషుల రూపంలో అంటూ సెటైర్లు వేశారు. ఇన్ని రోజులు గిరిజనులకు ఎవరూ లేరని కానీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని సంజయ్ స్పష్టం చేశారు.

గిరిజనుల మీద దాడులు చేసినా, బెదిరించినా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. గిరిజనుల మీద దాడులు చేయడంతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టిన వారిపై కేసీఆర్ చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Also Read:గుర్రంపోడు: బీజేపీ- టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీ, ఉద్రిక్తత

ఇందుకు బాధ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. నాగార్జున సాగర్‌లో కూడా పోడు భూముల సమస్య వుందని.. గిరిజనుల కోసం ఏ పార్టీ ఆలోచించడం లేదని కేవలం బీజేపీ ఒక్కటే వారి పక్షాన పోరాడుతుందన్నారు.

గిరిజనుల భూముల్ని పరిశీలించడానికి వస్తే బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయడంతో పాటు రాళ్లతో కొట్టారని సంజయ్ మండిపడ్డారు. పోడు భూములు, గిరిజనులు, ఆదివాసీలు, దళితులకు టీఆర్ఎస్ గతంలో మూడెకరాల స్థలం ఇస్తామని చెప్పిందని.. కానీ ఈరోజున భూమి లాక్కొంటోందని ఆయన ఆరోపించారు. అవసరమైతే భూముల్ని లాక్కుని గిరిజనులకు పంచుతామని సంజయ్ స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios