కారణమిదీ: బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుండి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే కళ్యాణ్ సింగ్ మరణంతో పార్టీ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 24వ తేదీ వరకు సంతాపదినాలుగా ప్రకటించింది.
హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 24 వ తేదీ నండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణంతో పార్టీ కార్యక్రమాలను వాయిదా వేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకొంది. దీంతో ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా ఆ పార్టీ నాయకుు ప్రకటించారు.
also read:బండి సంజయ్ పాదయాత్ర మరోసారి వాయిదా పడే ఛాన్స్.. కారణమిదే..?
ఈ నెల తొలి వారంలో ప్రారంభం కావాల్సిన పాదయాత్రను పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా వేశారు. ఈ నెల 9వ తేదీ నుండి ఈ యాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకొన్నారు.
అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా పార్టీకి చెందిన కీలక నేతలు ఈ పాదయాత్రలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో యాత్రను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 24 నుండి యాత్ర నిర్వహణకు పార్టీ శ్రేణులు సిద్దం చేసుకొంటున్నాయి.
ఈ సమయంలో యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మరణించాడు. కళ్యాణ్ సింగ్ మృతికి సంతాపంగా అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెల 24వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. దీంతో ఈ నెల 24వ తేదీ నుండి చేపట్టాల్సిన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది.