డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు రావాల్సిన రూ.40 వేల కోట్ల ఆదాయం తగ్గిందని...కేంద్రం ఆంక్షల వల్లే ఇలా జరిగిందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ విషయాలను అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.