తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.


హైదరాబాద్: తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.

ఈ నెల 22 వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌పై ఇవాళ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన పలు అంశాలపై కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు.

సీఎం కేసీఆర్ సమాధానం తర్వాత ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే సభ నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ చివరి రోజున డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.