బ్రేకింగ్: తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఓ ఉద్యోగికి పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. శాసనసభలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా తేలింది. అతనిని పాస్లు జారీ చేసే కౌంటర్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు
తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. శాసనసభలో విధులు నిర్వర్తించే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా తేలింది. అతనిని పాస్లు జారీ చేసే కౌంటర్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు.
ఈ పరిణామంతో అసెంబ్లీకి వచ్చే ఇతర ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నెల 28 వరకు అసెంబ్లీని నిర్వహించాలని తెలంగాణ సర్కార్ భావించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజే ఒక ఉద్యోగికి పాజిటివ్ తేలడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే అక్కడి అధికారులు, భద్రతా సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు.
వీటిలో నెగిటివ్ వచ్చిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. అయినప్పటికీ ఈ ఉద్యోగికి పాజిటివ్ ఎలా వచ్చిందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.