Asianet News TeluguAsianet News Telugu

ప్రజా కూటమి సీఎంపీ ముసాయిదా ఖరారు: రేపు విడుదల

ప్రజా కూటమి(మహాకూటమి) కామన్ మినిమమ్ ప్రోగ్రాం ముసాయిదా ఖరారైంది. కూటమిలోని అన్ని పార్టీలు నవంబర్ 13 వ తేదీన సీఎంపీని విడుదల చేస్తారు.

telangana assembly elections: prajakutami cmp draft finalised
Author
Hyderabad, First Published Nov 12, 2018, 12:11 PM IST


హైదరాబాద్: ప్రజా కూటమి(మహాకూటమి) కామన్ మినిమమ్ ప్రోగ్రాం ముసాయిదా ఖరారైంది. కూటమిలోని అన్ని పార్టీలు నవంబర్ 13 వ తేదీన సీఎంపీని విడుదల చేస్తారు.

కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సోమవారం నాడు కూటమి నేతలు సమావేశమయ్యారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ,  టీజేఎస్ చీఫ్ కోదండరామ్, ప్రజా యుద్దనౌక గద్దర్  తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్నందున  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ముసాయిదా ప్రతి గురించి  ఈ మూడు పార్టీల నేతలు మరోసారి సోమవారం నాడు  చర్చించారు.ఈ సమావేశం నుండే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి ముసాయిదా ప్రతి గురించి వివరించారు. ఈ ముసాయిదా పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడ సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక  చేపట్టనున్న అంశాలనే  ముసాయిదాలో పొందుపర్చినట్టుగా కూటమి నేతలు ప్రకటించారు.  కూటమిలోని భాగస్వామ్య పక్షాలు  ఈ విషయమై ముసాయిదాను మంగళవారం నాడు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సామాన్యులకు అనుకూలంగా ముసాయిదా ఉంటుందని  నేతలు చెప్పారు. ముసాయిదాను ప్రజల్లో విస్తతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు  చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios