KTR: విద్యుత్ సరఫరాపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు.. హస్తం పార్టీపై కేటీఆర్ ఫైర్
Kalvakuntla Taraka Rama Rao: ప్రజలు కాంగ్రెస్కు, బీజేపీకి ఓటేస్తే తెలంగాణపైనా, ప్రజలపైనా అభిమానం లేని రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీలకు ఓట్లు పడతాయని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు.
![Telangana Assembly Elections 2023: Congress has no moral right to talk about power supply, BRS leader KT Rama Rao RMA Telangana Assembly Elections 2023: Congress has no moral right to talk about power supply, BRS leader KT Rama Rao RMA](https://static-ai.asianetnews.com/images/01fa2wg2xdsgnpm1qkbrc8z9cq/ktr-2-new-jpg_363x203xt.jpg)
Telangana Assembly Elections 2023: గత కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. విద్యుత్ సరఫరాపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని మండిపడ్డారు. ముస్తాబాద్ మండలంలో జరిగిన ఎన్నికల ప్రచార రోడ్షోలో పాల్గొన్న ఆయన.. తెలంగాణలోని రైతులు ఏ పంపుసెట్లు వాడుతున్నారో కూడా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి తెలియదని దుయ్యబట్టారు. వ్యవసాయ రంగానికి 3 గంటల కరెంటు సరిపోతుందని 10 హెచ్పీ మోటార్లు వినియోగిస్తున్నారని రేవంత్ చెబుతున్నప్పటికీ వాస్తవంగా రాష్ట్రంలోని ఏ రైతు కూడా 10 హెచ్పి పంపుసెట్ను ఉపయోగించడం లేదని కేటీఆర్ విమర్శించారు.
ప్రజలు తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తగిన విధంగా వినియోగించుకోవాలనీ, కాంగ్రెస్, బీజేపీలకు తగిన విధంగా బుద్ధి చెప్పాలని విమర్శించారు. తమ హయాంలో కరెంటు, తాగు, సాగునీరు, విత్తనాలు, ఎరువులు, మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన కాంగ్రెస్ ఇప్పుడు రైతాంగాన్ని ఎలా ఆదుకుంటుందని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ 24 గంటల కరెంటు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్కు లేదా బీజేపీకి ఓటేస్తే, తెలంగాణపైనా, అక్కడి ప్రజలపైనా అభిమానం లేని రాహుల్ గాంధీ , నరేంద్ర మోడీలకు ఓట్లు పడతాయని ఆయన అన్నారు. ఆ రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇక సోమవారం సాయంత్రం టీఆర్ ప్రసంగించిన రోడ్ షోలో అధికార బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, చిల్కానగర్ నుంచి ఉప్పల్ క్రాస్ రోడ్స్ ను కలిపే నాలుగు లేన్ల వద్ద కార్యకర్తలు కేటీఆర్ కు స్వాగతం పలుకుతూ చౌరస్తా వద్దకు చేరుకున్నారు. బీఆర్ ఎస్ జెండాలు, బంటింగ్ లతో చౌరస్తా గులాబీమయంగా మారింది. కేటీఆర్ ప్రసంగాన్ని వినడానికి ఇటీవల ప్రారంభించిన స్కైవాక్ పై కూడా బీఆర్ఎస్ అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉప్పల్ జంక్షన్ కు చేరుకునే ముందు గులాబీ కండువాలు, టోపీలు ధరించిన నాయకులు హుబ్బిగూడ, చిల్కానగర్, రామంతాపూర్ నుంచి వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి సభాస్థలికి చేరుకున్నారు.